Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- వికారాబాద్లో ఘోర అమానుషం
- ఆస్తి కోసం కన్న కొడుకు ఘాతుకం
- పెట్రోల్, డీజిల్తో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి.. సవతి తల్లి కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. ఆస్తి కూడా దక్కదని తెలిసి రాక్షసునిగా మారాడు. ఏకంగా తండ్రిని, సవతి తల్లి కుటుంబాన్ని మూకుమ్మడిగా హత్య చేయాలని డిసైడయ్యాడు. తన ప్లాన్ అమలు చేయడంతో ఇంటిల్లిపాది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇంతకీ ఆ కొడుకు ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగింది?
తండ్రి తీసుకున్న కఠిన నిర్ణయం.. కొడుకు మనసులో పెరిగిన బాధ.. చివరకు ఒక కుటుంబాన్ని అగ్నికి ఆహుతి చేసిన విషాద ఘటనగా మారింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్సింగ్ తండా గ్రామంలో ఈ దారుణం జరిగింది. డబ్బు ముందు మానవ సంబంధాల విలువను ఈ ఘటన మళ్లీ ప్రశ్నార్థకంగా మార్చింది.
Also Read
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ఇటీవలే గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది రమణి బాయి. ఐతే ఆ కుటుంబం.. బయటకు చూస్తే సంతోషంగా కనిపించినా.. లోపల మాత్రం విభేదాల మంటలు రగులుతున్నాయి. భర్త హన్మంతుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య 5 నెలల క్రితం మరణించింది. ఐతే ఆమెకు పుట్టిన కొడుకు అనార్సింగ్ హైదరాబాద్లో జీవనం సాగిస్తున్నాడు.
తల్లి మరణం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు బీమా రూ.5 లక్షలు, అలాగే కుటుంబ ఆస్తిలో తన వాటా కావాలని తండ్రి హన్మంతును అడిగాడు కొడుకు అనార్ సింగ్. అయితే హన్మంతు మాత్రం ఆ డబ్బులు, ఆస్తి ఇవ్వనని మొండిగా నిలబడ్డాడు. దీంతో తండ్రీ-కొడుకుల మధ్య విభేదాలు షురూ అయ్యాయి. ఇద్దరూ గ్రామంలో పంచాయితీ చేసుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
సరిగ్గా ఇక్కడి నుంచే అనార్ సింగ్ ఆలోచనలు తప్పుదారి పట్టాయి. నాకేం దక్కదు అన్న నిస్సహాయ భావన ఆవరించింది. దీంతో ఆస్తి కోసం అత్యంత దారుణమైన ప్లాన్ వేశాడు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తన తండ్రి హన్మంతుతోపాటు.. పిన్ని సర్పంచ్ రమణి బాయి, వారి ఇద్దరు పిల్లలు వెంకటేష్, శివను చంపాలని స్కెచ్చేశాడు. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ తీసుకు వచ్చాడు. ముందుగా ఇంటికి తాళం వేశాడు. అనంతరం పైకప్పు రంధ్రం ద్వారా పెట్రోల్, డీజిల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. లోపల ఉన్న నలుగురు ప్రాణాల కోసం అరుస్తుండగా.. ఆ కేకలు గ్రామాన్ని కుదిపేశాయి…
పక్కనే ఉన్న గ్రామస్తులు పరుగెత్తుకొచ్చి తలుపులు బద్దలు కొట్టి బాధితులను బయటకు తీసి 100 నంబర్కు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు పంపించారు. ప్రస్తుతం వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటనలో అనార్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
సర్పంచ్ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్న అనార్సింగ్ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!