Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- వికారాబాద్లో ఘోర అమానుషం
- ఆస్తి కోసం కన్న కొడుకు ఘాతుకం
- పెట్రోల్, డీజిల్తో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి.. సవతి తల్లి కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. ఆస్తి కూడా దక్కదని తెలిసి రాక్షసునిగా మారాడు. ఏకంగా తండ్రిని, సవతి తల్లి కుటుంబాన్ని మూకుమ్మడిగా హత్య చేయాలని డిసైడయ్యాడు. తన ప్లాన్ అమలు చేయడంతో ఇంటిల్లిపాది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇంతకీ ఆ కొడుకు ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగింది?
తండ్రి తీసుకున్న కఠిన నిర్ణయం.. కొడుకు మనసులో పెరిగిన బాధ.. చివరకు ఒక కుటుంబాన్ని అగ్నికి ఆహుతి చేసిన విషాద ఘటనగా మారింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్సింగ్ తండా గ్రామంలో ఈ దారుణం జరిగింది. డబ్బు ముందు మానవ సంబంధాల విలువను ఈ ఘటన మళ్లీ ప్రశ్నార్థకంగా మార్చింది.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ఇటీవలే గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది రమణి బాయి. ఐతే ఆ కుటుంబం.. బయటకు చూస్తే సంతోషంగా కనిపించినా.. లోపల మాత్రం విభేదాల మంటలు రగులుతున్నాయి. భర్త హన్మంతుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య 5 నెలల క్రితం మరణించింది. ఐతే ఆమెకు పుట్టిన కొడుకు అనార్సింగ్ హైదరాబాద్లో జీవనం సాగిస్తున్నాడు.
తల్లి మరణం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు బీమా రూ.5 లక్షలు, అలాగే కుటుంబ ఆస్తిలో తన వాటా కావాలని తండ్రి హన్మంతును అడిగాడు కొడుకు అనార్ సింగ్. అయితే హన్మంతు మాత్రం ఆ డబ్బులు, ఆస్తి ఇవ్వనని మొండిగా నిలబడ్డాడు. దీంతో తండ్రీ-కొడుకుల మధ్య విభేదాలు షురూ అయ్యాయి. ఇద్దరూ గ్రామంలో పంచాయితీ చేసుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
సరిగ్గా ఇక్కడి నుంచే అనార్ సింగ్ ఆలోచనలు తప్పుదారి పట్టాయి. నాకేం దక్కదు అన్న నిస్సహాయ భావన ఆవరించింది. దీంతో ఆస్తి కోసం అత్యంత దారుణమైన ప్లాన్ వేశాడు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తన తండ్రి హన్మంతుతోపాటు.. పిన్ని సర్పంచ్ రమణి బాయి, వారి ఇద్దరు పిల్లలు వెంకటేష్, శివను చంపాలని స్కెచ్చేశాడు. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ తీసుకు వచ్చాడు. ముందుగా ఇంటికి తాళం వేశాడు. అనంతరం పైకప్పు రంధ్రం ద్వారా పెట్రోల్, డీజిల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. లోపల ఉన్న నలుగురు ప్రాణాల కోసం అరుస్తుండగా.. ఆ కేకలు గ్రామాన్ని కుదిపేశాయి…
పక్కనే ఉన్న గ్రామస్తులు పరుగెత్తుకొచ్చి తలుపులు బద్దలు కొట్టి బాధితులను బయటకు తీసి 100 నంబర్కు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు పంపించారు. ప్రస్తుతం వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటనలో అనార్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
సర్పంచ్ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్న అనార్సింగ్ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!