Lagacharla Industrial Park: లగచర్లలో పారిశ్రామిక పార్కు భూసేకరణకు నోటిఫికేషన్..
- బహుళార్థ పారిశ్రామిక పార్కు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ..
- లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lagacharla Industrial Park: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండస్ట్రియల్ పార్క్ను వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. లాగాచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాలలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ అధికారిగా తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ నియమించింది. ఇటీవల రైతులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో గతంలో ఇక్కడి ఫార్మా గ్రామాల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పల్లెలు కాలుష్యంగా మారతాయని లగచర్ల ప్రజలు భూసేకరణను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో లగచర్ల, పోలేపల్లిలో కాలుష్య రహిత సంస్థలు నెలకొల్పితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Read also: OTS Scheme: నేటితో ముగియనున్న ఓటీఎస్ ఆఫర్.. రేపటి నుంచి బాదుడే
Also Read
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
దీంతో ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దుద్యాల మండలంలోని లగచర్లలో, పోలేపల్లిలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్ లో భాగంగా టెక్స్ టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టెక్సైల్ కంపెనీ ఏర్పాటు చేసినా.. ఇక్కడ పొల్యూషన్ ఉండదని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Farmers Festival: నేడు పాలమూరులో రైతు పండగ ముగింపు సభ.. సీఎం శుభవార్త చెబుతారా..
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?