Lagacharla Industrial Park: లగచర్లలో పారిశ్రామిక పార్కు భూసేకరణకు నోటిఫికేషన్..
- బహుళార్థ పారిశ్రామిక పార్కు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ..
- లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lagacharla Industrial Park: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండస్ట్రియల్ పార్క్ను వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. లాగాచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాలలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ అధికారిగా తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ నియమించింది. ఇటీవల రైతులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో గతంలో ఇక్కడి ఫార్మా గ్రామాల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పల్లెలు కాలుష్యంగా మారతాయని లగచర్ల ప్రజలు భూసేకరణను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో లగచర్ల, పోలేపల్లిలో కాలుష్య రహిత సంస్థలు నెలకొల్పితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Read also: OTS Scheme: నేటితో ముగియనున్న ఓటీఎస్ ఆఫర్.. రేపటి నుంచి బాదుడే
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
దీంతో ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దుద్యాల మండలంలోని లగచర్లలో, పోలేపల్లిలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్ లో భాగంగా టెక్స్ టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టెక్సైల్ కంపెనీ ఏర్పాటు చేసినా.. ఇక్కడ పొల్యూషన్ ఉండదని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Farmers Festival: నేడు పాలమూరులో రైతు పండగ ముగింపు సభ.. సీఎం శుభవార్త చెబుతారా..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!