ఊసరవెల్లి కేసీఆర్ను ప్రజలు గద్దె దింపాలి: విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊసరవెల్లి కేసీఆర్ను ప్రజలు గద్దె దింపాలంటూ విజయశాంతి తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై నిప్పులు చెరిగారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి… కాదని వేస్తే కొనుగోలు కేంద్రాలే ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించారన్నారు. పంటకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నామని వడ్ల ముచ్చటను మర్చిపోయేలా చేయడానికే, ఊరూరా రైతుబంధు సంబురాలు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని విజయశాంతి మండిపడ్డారు. డప్పుల దరువులతో రైతుబంధును జాకీలతోని లేపాలే అన్నట్టుగా… మీడియా కవరేజ్ మిస్ గాకుంట జూడాలే అన్నట్టుగా వారం రోజుల నుండి రైతుబంధు రాజకీయ విన్యాసాలకు తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వరోగనివారిణి రైతుబంధే అన్నట్టు…కరోనా నిబంధనల్ని కాళ్ల కింద వేసి తొక్కి మరీ చారణ కోడికి బారాణ మసాలా ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ అసలు ఈ రైతుబంధు వారోత్సవాలు ఎందుకోసం? అని ప్రశ్నించారు.
Read Also: పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
రైతులకు రూ. లక్ష లోపు ఉన్న పంట రుణాలను సీఎం కేసీఆర్ మాఫీ చేయనందుకా? లేక 2018 ఎన్నికల ముందు రైతులందరికి ఉచితంగా ఎరువులు ఇస్తానని ఇయ్యనందుకా? పోనీ ఏడేండ్ల కేసీఆర్ ఏలుబడిలో వేలాది మంది రైతుల ఉసురు తీసుకున్నందుకా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయందుకా? ఎందుకు ఈ రైతు బంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నల్గొండ జిల్లాలో ఓ యువ రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ… రుణమాఫీ చేసి ఉంటే బ్యాంకులో అప్పు పుట్టి మళ్లీ వ్యవసాయం చేసుకొనేవాడినని… రుణమాఫీ చేయకపోవడంతోనే తన భూమి అమ్ముకున్నానని నిరసన తెలుపుతుంటే… అధికారపార్టీ నేతలు తనని అడ్డుకొని కొట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అంటూ విర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ సర్కార్ రైతులను కూడా మోసగించాలని చూస్తోందన్నారు. రైతులు మోసపోయే స్థితిలో లేరంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలు చావు దెబ్బ కొడతారంటూ హెచ్చరించారు.
- Tags
- bjp
- kcr
- political news
- telangana
- TRS
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!