Suicide : “నీ కొడుకు తలరాత ఇలానే రాస్తావా.?” సూసైడ్ నోట్లో దేవుడిపై యువకుడు
- నీ కొడుకైతే వానికి ఇలానే తలరాత రాస్తావా?"
- సూసైడ్ నోట్ లో భగవంతుడిని ప్రశ్నించిన యువకుడు
- నా శరీరాన్ని కాశీలో దహనం చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముదిరాజ్ వీధికి చెందిన దీటి రోహిత్ (23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు రోహిత్ ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. అందులో అతను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, విఫలమైన ఆశల గురించి విచారం వ్యక్తం చేశాడు. “నీ కొడుకు అయితే వాని తలరాత ఇలానే రాస్తావా?” అంటూ భగవంతుడిని ప్రశ్నిస్తూ వ్రాసిన వాక్యం, నోటులోని కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ మాటలు అతని జీవితంలోని నొప్పిని, అసహనాన్ని చాటిచెప్పుతున్నాయి.
“నా కలలు కూలిపోయాయి…” అని.. ఆత్మహత్యా లేఖలో రోహిత్ ఇలా పేర్కొన్నాడు.. “My dream of writing the best suicide letter has come true by God’s grace, but living my dreams, of what I thought, had collapsed.” అంటే, జీవితం పట్ల గల ఆశలు తారుమారైనట్టు తాను చెబుతున్నాడు. తాను పలు ప్రయత్నాలు చేసినా జీవితం విజయవంతంగా సాగలేదని, జీవించడానికంటే చనిపోవడమే తక్కువ నొప్పిగా అనిపిస్తోందని రాసుకున్నాడు.
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
EXCLUSIVE : హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. టైటిల్ ఇదే..
సూసైడ్ నోట్ చివర్లో తన తుది కోరికను కూడా వ్యక్తం చేశాడు. “My last wish is to burn my physical body in ghats of Kashi” అని రాసి, తన మృతదేహాన్ని వారణాసి (కాశీ) ఘాట్లలో దహనం చేయాలని కోరుకున్నాడు. ఈ వాక్యం అతని ఆధ్యాత్మికత, అంతిమ శరణాగతి పట్ల ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. ఇక.. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్రాథమికంగా ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నప్పటికీ, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వేములవాడలోని యువతలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఒక విద్యావంతుడు యువకుడు ఈ స్థాయిలో మానసికంగా విసిగిపోవడం చర్చనీయాంశమైంది. మానసిక ఆరోగ్యంపై సమాజం ఇంకా స్పష్టమైన చైతన్యం కలిగి ఉండాలన్న అవసరం స్పష్టమవుతోంది.
Xiaomi YU7 SUV: 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్లు.. ఆటో మార్కెట్లో సంచలనం
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!