Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కిషన్ రెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆ బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. గత 45 ఏళ్లుగా ప్రజాజీవనంలో నిష్కళంకంగా సేవ చేస్తున్న కిషన్ రెడ్డిని మించిన సరైన అభ్యర్థి ఇంకెవరుంటారు? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం కోసం వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించాను. ఆ పరిస్థితులు చూస్తుంటే.. ప్రభుత్వం ఎవరిది ఏర్పడుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. దేశమంతా మోడీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్ట చేస్తోందన్నారు.
Read also: Ragidi Laxma Reddy: ఎన్ని కుతంత్రాలు చేసిన గెలుపు మాదే..
Also Read
- CJP Protest: నేడు హైదరాబాద్లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా.. సోనమ్ వాంగ్చుక్ హాజరు!
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- OTR : కవిత కొత్త పార్టీకి టిఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా.. పార్టీ పేరు మారుతుందా?
- Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
13వ తేదీ ఎన్నికల కోసం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి పోటీయే లేదన్నారు. మోడీ గెలుస్తారు, కిషన్ రెడ్డి గెలుస్తారని మనకు అర్థమైందన్నారు. నేనొక్కడిని ఓటింగ్ కు పోకపోతే ఏమవుతుందనే అలసత్వం మాత్రం వద్దు.. కచ్చితంగా ఓటింగ్ కేంద్రాలకు వెళ్లండన్నారు. కారు.. కార్ఖానాలోకి పోయిందని, చేతి పని అయిపోయింది.. కమల వికాసం కొనసాగుతుందన్నారు. మేం ఉత్తరాఖండ్ లో ‘ల్యాండ్ జిహాద్’పై కఠినంగా చర్యలు తీసుకున్నామన్నారు. 5వేల ఎకరాలకు పైగా స్థలాన్ని బలవంతపు ఆక్రమణ నుంచి కాపాడుకున్నామన్నారు. దేశంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒకే చట్టం వర్తించాలి.. అందుకే UCCని మేం తీసుకొచ్చామన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటుచేసిన మొదటి రాష్ట్రంగా నిలిచామన్నారు.
Read also: G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.?
అంబేడ్కర్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే.. తుష్టీకరణ రాజకీయాలకోసం మతపరమైన రిజర్వేషన్లు తీసుకువస్తామని అంటుందన్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. నేను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని మోడీ చెప్పారని తెలిపారు. మోడీ కన్నా గ్యారంటీ ఇంకే కావాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడుదొంగలన్నారు. కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా? అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.. ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. యువతకు నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని మండిపడ్డారు.
KTR: పద్మారావు గౌడ్ను గెలిపించి.. కాంగ్రెస్, బీజేపీకి బుద్ది చెప్పాలి..
తాజావార్తలు
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
WiFi Signal Issues : ఇంట్లో వైఫై స్పీడ్ తగ్గిపోతుందా? కారణం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. ఈ విషయాలు కూడా చెక్ చేయండి!
-
Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
-
ChatGPT: చాట్ జీపీటీ వాడుతున్నారా?.. భారీ నష్టం తప్పదు!.. AI పాయిజనింగ్ ముప్పు గురించి తెలుసుకోండి
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!