Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కిషన్ రెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆ బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. గత 45 ఏళ్లుగా ప్రజాజీవనంలో నిష్కళంకంగా సేవ చేస్తున్న కిషన్ రెడ్డిని మించిన సరైన అభ్యర్థి ఇంకెవరుంటారు? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం కోసం వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించాను. ఆ పరిస్థితులు చూస్తుంటే.. ప్రభుత్వం ఎవరిది ఏర్పడుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. దేశమంతా మోడీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్ట చేస్తోందన్నారు.
Read also: Ragidi Laxma Reddy: ఎన్ని కుతంత్రాలు చేసిన గెలుపు మాదే..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
13వ తేదీ ఎన్నికల కోసం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి పోటీయే లేదన్నారు. మోడీ గెలుస్తారు, కిషన్ రెడ్డి గెలుస్తారని మనకు అర్థమైందన్నారు. నేనొక్కడిని ఓటింగ్ కు పోకపోతే ఏమవుతుందనే అలసత్వం మాత్రం వద్దు.. కచ్చితంగా ఓటింగ్ కేంద్రాలకు వెళ్లండన్నారు. కారు.. కార్ఖానాలోకి పోయిందని, చేతి పని అయిపోయింది.. కమల వికాసం కొనసాగుతుందన్నారు. మేం ఉత్తరాఖండ్ లో ‘ల్యాండ్ జిహాద్’పై కఠినంగా చర్యలు తీసుకున్నామన్నారు. 5వేల ఎకరాలకు పైగా స్థలాన్ని బలవంతపు ఆక్రమణ నుంచి కాపాడుకున్నామన్నారు. దేశంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒకే చట్టం వర్తించాలి.. అందుకే UCCని మేం తీసుకొచ్చామన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటుచేసిన మొదటి రాష్ట్రంగా నిలిచామన్నారు.
Read also: G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.?
అంబేడ్కర్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే.. తుష్టీకరణ రాజకీయాలకోసం మతపరమైన రిజర్వేషన్లు తీసుకువస్తామని అంటుందన్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. నేను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని మోడీ చెప్పారని తెలిపారు. మోడీ కన్నా గ్యారంటీ ఇంకే కావాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడుదొంగలన్నారు. కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా? అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.. ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. యువతకు నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని మండిపడ్డారు.
KTR: పద్మారావు గౌడ్ను గెలిపించి.. కాంగ్రెస్, బీజేపీకి బుద్ది చెప్పాలి..
తాజావార్తలు
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!