Kishan Reddy: 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kishan Reddy: హైదారబాద్ లోని తాజ్ కృష్ణ లో G-20 స్టార్టప్-20 సదస్సు ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో 20 దేశాల ప్రతినిధులు 9దేశాల ప్రత్యేక ఆహ్వానితులు వివిధ అంతర్జాతీయ స్టార్టప్ సంస్థలు పాల్గొన్నారు. స్టార్టప్ ల అభివృద్ధి ఎజెండాగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో జీ-20 స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం వేచిచూడటం కంటే.. ఉద్యోగాలు సృష్టించే దిశగా నేటి యువత ముందడుగేస్తోందన్నారు. ప్రధానమంత్రి ‘స్టార్టప్ ఇండియా’ ఆలోచన కారణంగానే యువతకు ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. 85వేలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లతో ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్ అన్నారు కేంద్ర మంత్రి. ఈ స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి అని తెలిపారు. అందుకే ఈ వ్యవస్థను ప్రోత్సహించేలా పాలసీలు రూపొందించిందని అన్నారు. ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’లను కేంద్రం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానాలు మెరుగుపడిందని తెలిపారు. వచ్చే 25 ఏళ్ల అమృత కాలాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని మరిన్ని కొత్త ఆలోచనలతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు.
Read also: Fire Accident: నర్సింగ్ హోమ్ లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో ఇద్దరు వైద్యులు
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
దేశంలో తెలంగాణ యువ రాష్ట్రంగా నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ముందుకు వెళ్తోందని అన్నారు. దేశంలో 19 వేల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని, రోజుకు ఐదారు కొత్త స్టార్టప్ కంపెనీలు పుడుతున్నాయని తెలిపారు. పరిశ్రమలు, ఐటి, విద్య, వైద్య రంగాల్లో అంకుర సంస్థలు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ఇంటర్నెట్ సేవలు విస్తృతం అవుతున్నా కొద్దీ స్టార్టప్ సంస్థల్లో కొత్త ఆలోచనలు వస్తున్నాయని తెలిపారు. నీతి అయోగ్ కూడా థింక్ ట్యాంక్ లాంటిందన్నారు. కేంద్రం రాష్ట్రాలకే కాకుండా మారుమూల గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నీతి అయోగ్ పరిధిలో ఎన్నో ఇన్నోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా 69 ఇంక్యూబేషన్ సిస్టమ్స్ ఉన్నాయి.
Waltair Veerayya: వరంగల్ కు వాల్తేరు వీరయ్య టీమ్.. గెస్ట్ గా ఆర్ఆర్ఆర్ హీరో..
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!