TSPSC Group-2 Exam: గ్రూప్-2 పరీక్ష వాయిదా మళ్లీ నవంబర్లో.. కేటీఆర్ ట్విట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Group-2 Exam: ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో.. ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంప్రదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో… గ్రూప్-2 అభ్యర్థుల పోరు ఫలించినట్లే.
Read also: Shiva Abhishekam: గ్రహబాధల నుంచి ఉపశమనం కలగాలంటే ఈ అభిషేకం వీక్షించండి
Also Read
ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసి.. మళ్లీ నవంబర్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈరోజు గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శులు సీఎం కేసీఆర్ సమీక్షించారు. గ్రూప్-2 పరీక్షలను నవంబర్కు వాయిదా వేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, గ్రూప్-2 పరీక్షను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన తెలిపారు. మరోవైపు.. 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆగస్టు 14న గ్రూప్-2 పరీక్ష వాయిదాపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని టీఎస్పీఎస్సీ తెలిపిన సంగతి తెలిసిందే.. మరోవైపు అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించుతూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read also: Tata Technologies IPO: 20ఏళ్ల తర్వాత టాటా ఐపీవో బూమ్.. గ్రే మార్కెట్లో ప్రీమియం రికార్డు
గ్రూప్-2 పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం ముందస్తుగా నిర్ణయించింది. కాగా, ఇదే నెలలో గురుకుల పరీక్షలతో పాటు మరికొన్ని పోటీ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్-2 పరీక్షకు సిద్ధమవుతున్న పలువురు అభ్యర్థులు కూడా గురుకుల పరీక్షలకు పోటీ పడుతుండడంతో.. పూర్తిగా దేనికి సన్నద్ధం కాలేకపోతున్నామని పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు వాదిస్తూ వచ్చారు. అయితే, ఆ వాదనకు బలం చేకూర్చేలా రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు తమ గళం వినిపించడంతో నిన్నటి నుంచి వారి పోరు ఊపందుకుంది. టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట వేలాది మంది అభ్యర్థులు గుమిగూడారు. ప్రతిపక్షాలు కూడా వారికి మద్దతు పలికాయి. అధికారులు స్పందించకపోవడంతో 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు టీఎస్ పీఎస్సీపై అసహనం వ్యక్తం చేసింది. కాగా, సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని TSPSC తెలిపింది.
Astrology: ఆగస్టు 13, ఆదివారం దినఫలాలు
తాజావార్తలు
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!