Ramayana: భారత్ మండపంలో గ్రాండ్ ఈవెంట్.. ‘రామాయణం’ ట్రైలర్కు భారీ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ‘రామాయణం’ ఒకటి. ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలు, భారీ తారాగణం, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింబ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు ట్రైలర్ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ట్రైలర్ను దేశ రాజధానిలో అత్యంత వైభవంగా ఆవిష్కరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణం’ ట్రైలర్ను జూలై 18న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే భారీ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. భారతీయ సంస్కృతి, పురాణ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఈ సినిమా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం కూడా హాజరుకానున్నట్లు సమాచారం. దీంతో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ చేయని స్థాయిలో ఈ వేడుకను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో కూడా గుప్పుమంటున్నాయి.
Also Read
- Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
- Newton's Third Law: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ..
- GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
- IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ 'IAM GAME' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ ఇతిహాస చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తున్నారు. రావణుడిగా యశ్ నటిస్తుండగా, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు. అలాగే రవీ దూబే, రాకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తారాగణం సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్తో పాటు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని 2026 దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. ఇప్పటికే ‘రామాయణం’పై నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో, జూలై 18న విడుదల కానున్న ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతుందా అనే ఉత్కంఠ ఇప్పుడు సినీ అభిమానుల్లో కనిపిస్తోంది.
తాజావార్తలు
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
-
World Cup 2027: వరల్డ్ కప్లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!