TS Police: నేటి నుంచి పోలీసు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు.. 52వేల మంది హాజరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Police: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఈ రోజు (ఫిబ్రవరి 15) నుండి ఫిజికల్ ఈవెంట్లను నిర్వహించనుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోయినా, కోర్టు ఆదేశాలతో పలువురు ఎస్సీ, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు నేటి నుంచి పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. ఈపరీక్షలో ఏకంగా 52 వేల మందికి పైగా అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట డిసెంబర్ 8 నుంచి 31 వరకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారు. అవి కనిష్టంగా 9 రోజులు కాగా.. గరిష్టంగా 24 రోజులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేటలో వీటిని నిర్వహించారు. ఇప్పటికే ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07 లక్షల మందిని అప్పట్లో ఈ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.
Read also: Kondagattu: బస్సు ప్రమాదం.. కండక్టర్ మృతి, 9 మందికి గాయాలు
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
ఇప్పుడు కొన్ని కేంద్రాలను తగ్గించారు. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేసింది. గత ఏడాది ఆగస్టులో 16,875 పోస్టుల కోసం టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షకు దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు 60 మార్కులు సాధించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో 8 తప్పులు దొర్లాయి. టీఎస్ఎల్పీఆర్బీ ఫలితాలు విడుదల చేసి వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పట్లో 2.07 లక్షల మందిని అర్హులుగా గుర్తించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది రాత పరీక్షలకు ఎంపిక చేశారు. ఆ పరీక్షలను మార్చిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రిలిమినరీ రాతపరీక్షలో తప్పు ప్రశ్నలను తొలగించకుండా.. వాటికి మార్కులను జోడించాలనే డిమాండ్ మొదలైంది. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిని విచారించిన కోర్టు మార్కులు కలిపి వేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో 8 మార్కులు కలిపి 52 వేల మంది అదనంగా అర్హత సాధించారు.
Yadagirigutta: 21 నుంచి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు
తాజావార్తలు
-
Kaviya Maran: సన్రైజర్స్ ఓనరమ్మతో అనిరుధ్ పెళ్లి పక్కా.. బంధువుల ఇంటర్వ్యూతో లీకైన పెళ్లి ముచ్చట..
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!