TS Police: నేటి నుంచి పోలీసు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు.. 52వేల మంది హాజరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Police: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఈ రోజు (ఫిబ్రవరి 15) నుండి ఫిజికల్ ఈవెంట్లను నిర్వహించనుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోయినా, కోర్టు ఆదేశాలతో పలువురు ఎస్సీ, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు నేటి నుంచి పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. ఈపరీక్షలో ఏకంగా 52 వేల మందికి పైగా అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట డిసెంబర్ 8 నుంచి 31 వరకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారు. అవి కనిష్టంగా 9 రోజులు కాగా.. గరిష్టంగా 24 రోజులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేటలో వీటిని నిర్వహించారు. ఇప్పటికే ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07 లక్షల మందిని అప్పట్లో ఈ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.
Read also: Kondagattu: బస్సు ప్రమాదం.. కండక్టర్ మృతి, 9 మందికి గాయాలు
Also Read
ఇప్పుడు కొన్ని కేంద్రాలను తగ్గించారు. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేసింది. గత ఏడాది ఆగస్టులో 16,875 పోస్టుల కోసం టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షకు దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు 60 మార్కులు సాధించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో 8 తప్పులు దొర్లాయి. టీఎస్ఎల్పీఆర్బీ ఫలితాలు విడుదల చేసి వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పట్లో 2.07 లక్షల మందిని అర్హులుగా గుర్తించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది రాత పరీక్షలకు ఎంపిక చేశారు. ఆ పరీక్షలను మార్చిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రిలిమినరీ రాతపరీక్షలో తప్పు ప్రశ్నలను తొలగించకుండా.. వాటికి మార్కులను జోడించాలనే డిమాండ్ మొదలైంది. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిని విచారించిన కోర్టు మార్కులు కలిపి వేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో 8 మార్కులు కలిపి 52 వేల మంది అదనంగా అర్హత సాధించారు.
Yadagirigutta: 21 నుంచి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!