Kondagattu: బస్సు ప్రమాదం.. కండక్టర్ మృతి, 9 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus accident near Kondagattu: జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇక్కడి రహదారులపై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాదారులు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బలవంతపూర్ ప్రధాన రహదారి రక్తసిక్తమైంది. ఎదురుగా వస్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును అతివేగంగా ఢీకొట్టడంతో.. ఎనిమిది మంది తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఈఘటన కొండగట్టు సమీపంలోని చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై లారీ, ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈఘటన కొండగట్టు సమీపంలోని బల్వంతాపూర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున ఈప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. రోడ్డుపై లారీ, బస్సులు ముందు భాగాలు తునాతునకలు అయ్యాయి. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ మద్యం సేవించి లారీ నడిపాడా? లేక బస్సు డ్రైవర్ నిద్రలో ఉండటం వలన ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణించే వారు గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గురికావడంతో రహదారిలో ఆర్తనాదాలు మిన్నంటాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులకు వైద్యంకోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈఘటన ఎలా జరిగింది అనేదానిపై ఆరాతీస్తున్నారు.
Step Wells : తెలంగాణలో మెట్ల బావులపై వెలుగులు నింపేందుకు కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?