Ts Highcourt: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేపటికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం కలిగిస్తున్న మొయినాబాద్ ఫాం హౌస్ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే అంశంపై ప్రత్యేక బృందంతో విచారణ కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన వారి రిమాండ్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్….హై ప్రొఫెషనల్ కేసులో ఏసీబి కోర్టు రిమాండ్ తిరస్కరించిందన్నారు ఏజీ.
Read Also: Horrific Accident: 70అడుగుల లోతులో పడిన కారు.. పండుగపూట విషాదం
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించారన్నారు ఏజీ. అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని, పోలీసులు ఈ కేసులో ప్రొసీజర్స్ ఫాలో కాలేదని రిమాండ్ తిరస్కరించిందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయంది హైకోర్టు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను 50 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నారు. టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి మారాలని ఆఫర్ చేశారన్నారు ఏజీ. ఈడీ, సిబిఐ కేసుల నుండి కాపాడుతామని కూడా చెప్పారన్నారు ఏజీ.
అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో ఎక్కడా కూడా ఖచ్చితంగా 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని చెప్పలేదన్నారు. ప్రతి కేసులో 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చెయ్యాలని లేదన్నారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. ఇది పక్కాగా ట్రాప్ చేసారా అని ప్రశ్నించింది హైకోర్టు..కెమెరాలు, ఆడియో రికార్డింగ్ వ్యవస్థ ముందే ఫాంహౌజ్ లో ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించింది హైకోర్టు. అన్ని సెట్ చేసి ట్రాప్ చేశామన్నారు ఏజీ. ప్రతి కేసులో నిందితుడికి 41a crpc నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదన్నారు ఏజీ.
Read Also: Ts Highcourt: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేపటికి వాయిదా
వేదుల శ్రీనివాస్ నిందితుల తరపు న్యాయవాది తమ పిటిషనర్ల పై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎలాంటి నగదు సంఘటన స్థలం వద్ద దొరకలేదు..హై ప్రొఫెషనల్ కేసులో ప్రతి ఒక్కరికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలి..అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో చాలా అంశాలు పొందుపరచారు. ఈరోజు సాయంత్రం వరకు అరెస్ట్ అయినా ముగ్గురు అడ్రస్ లు సీపీ కి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలిచ్చింది. 24 గంటల పాటు నిందితులు ఎటు వెళ్ళడానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. కేసు వివరాలు అఫిడవిట్స్ అన్ని ప్రతివాదులకు ఇవ్వాలని ఏజీ కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై రేపు ఆదేశాలు జారీచేస్తామంది హైకోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!