Ts Highcourt: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేపటికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం కలిగిస్తున్న మొయినాబాద్ ఫాం హౌస్ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే అంశంపై ప్రత్యేక బృందంతో విచారణ కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన వారి రిమాండ్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్….హై ప్రొఫెషనల్ కేసులో ఏసీబి కోర్టు రిమాండ్ తిరస్కరించిందన్నారు ఏజీ.
Read Also: Horrific Accident: 70అడుగుల లోతులో పడిన కారు.. పండుగపూట విషాదం
Also Read
రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించారన్నారు ఏజీ. అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని, పోలీసులు ఈ కేసులో ప్రొసీజర్స్ ఫాలో కాలేదని రిమాండ్ తిరస్కరించిందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయంది హైకోర్టు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను 50 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నారు. టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి మారాలని ఆఫర్ చేశారన్నారు ఏజీ. ఈడీ, సిబిఐ కేసుల నుండి కాపాడుతామని కూడా చెప్పారన్నారు ఏజీ.
అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో ఎక్కడా కూడా ఖచ్చితంగా 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని చెప్పలేదన్నారు. ప్రతి కేసులో 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చెయ్యాలని లేదన్నారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. ఇది పక్కాగా ట్రాప్ చేసారా అని ప్రశ్నించింది హైకోర్టు..కెమెరాలు, ఆడియో రికార్డింగ్ వ్యవస్థ ముందే ఫాంహౌజ్ లో ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించింది హైకోర్టు. అన్ని సెట్ చేసి ట్రాప్ చేశామన్నారు ఏజీ. ప్రతి కేసులో నిందితుడికి 41a crpc నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదన్నారు ఏజీ.
Read Also: Ts Highcourt: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేపటికి వాయిదా
వేదుల శ్రీనివాస్ నిందితుల తరపు న్యాయవాది తమ పిటిషనర్ల పై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎలాంటి నగదు సంఘటన స్థలం వద్ద దొరకలేదు..హై ప్రొఫెషనల్ కేసులో ప్రతి ఒక్కరికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలి..అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో చాలా అంశాలు పొందుపరచారు. ఈరోజు సాయంత్రం వరకు అరెస్ట్ అయినా ముగ్గురు అడ్రస్ లు సీపీ కి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలిచ్చింది. 24 గంటల పాటు నిందితులు ఎటు వెళ్ళడానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. కేసు వివరాలు అఫిడవిట్స్ అన్ని ప్రతివాదులకు ఇవ్వాలని ఏజీ కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై రేపు ఆదేశాలు జారీచేస్తామంది హైకోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!