Ts Highcourt: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేపటికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం కలిగిస్తున్న మొయినాబాద్ ఫాం హౌస్ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే అంశంపై ప్రత్యేక బృందంతో విచారణ కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన వారి రిమాండ్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్….హై ప్రొఫెషనల్ కేసులో ఏసీబి కోర్టు రిమాండ్ తిరస్కరించిందన్నారు ఏజీ.
Read Also: Horrific Accident: 70అడుగుల లోతులో పడిన కారు.. పండుగపూట విషాదం
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించారన్నారు ఏజీ. అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని, పోలీసులు ఈ కేసులో ప్రొసీజర్స్ ఫాలో కాలేదని రిమాండ్ తిరస్కరించిందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయంది హైకోర్టు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను 50 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నారు. టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి మారాలని ఆఫర్ చేశారన్నారు ఏజీ. ఈడీ, సిబిఐ కేసుల నుండి కాపాడుతామని కూడా చెప్పారన్నారు ఏజీ.
అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో ఎక్కడా కూడా ఖచ్చితంగా 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని చెప్పలేదన్నారు. ప్రతి కేసులో 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చెయ్యాలని లేదన్నారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. ఇది పక్కాగా ట్రాప్ చేసారా అని ప్రశ్నించింది హైకోర్టు..కెమెరాలు, ఆడియో రికార్డింగ్ వ్యవస్థ ముందే ఫాంహౌజ్ లో ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించింది హైకోర్టు. అన్ని సెట్ చేసి ట్రాప్ చేశామన్నారు ఏజీ. ప్రతి కేసులో నిందితుడికి 41a crpc నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదన్నారు ఏజీ.
Read Also: Ts Highcourt: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేపటికి వాయిదా
వేదుల శ్రీనివాస్ నిందితుల తరపు న్యాయవాది తమ పిటిషనర్ల పై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎలాంటి నగదు సంఘటన స్థలం వద్ద దొరకలేదు..హై ప్రొఫెషనల్ కేసులో ప్రతి ఒక్కరికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలి..అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో చాలా అంశాలు పొందుపరచారు. ఈరోజు సాయంత్రం వరకు అరెస్ట్ అయినా ముగ్గురు అడ్రస్ లు సీపీ కి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలిచ్చింది. 24 గంటల పాటు నిందితులు ఎటు వెళ్ళడానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. కేసు వివరాలు అఫిడవిట్స్ అన్ని ప్రతివాదులకు ఇవ్వాలని ఏజీ కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై రేపు ఆదేశాలు జారీచేస్తామంది హైకోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!