Ts Highcourt: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేపటికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం కలిగిస్తున్న మొయినాబాద్ ఫాం హౌస్ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే అంశంపై ప్రత్యేక బృందంతో విచారణ కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన వారి రిమాండ్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్….హై ప్రొఫెషనల్ కేసులో ఏసీబి కోర్టు రిమాండ్ తిరస్కరించిందన్నారు ఏజీ.
Read Also: Horrific Accident: 70అడుగుల లోతులో పడిన కారు.. పండుగపూట విషాదం
Also Read
- Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- OTR : రంగంలోకి బొత్స వారసురాలు..! అనూష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..!!
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించారన్నారు ఏజీ. అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని, పోలీసులు ఈ కేసులో ప్రొసీజర్స్ ఫాలో కాలేదని రిమాండ్ తిరస్కరించిందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయంది హైకోర్టు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను 50 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నారు. టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి మారాలని ఆఫర్ చేశారన్నారు ఏజీ. ఈడీ, సిబిఐ కేసుల నుండి కాపాడుతామని కూడా చెప్పారన్నారు ఏజీ.
అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో ఎక్కడా కూడా ఖచ్చితంగా 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని చెప్పలేదన్నారు. ప్రతి కేసులో 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చెయ్యాలని లేదన్నారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. ఇది పక్కాగా ట్రాప్ చేసారా అని ప్రశ్నించింది హైకోర్టు..కెమెరాలు, ఆడియో రికార్డింగ్ వ్యవస్థ ముందే ఫాంహౌజ్ లో ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించింది హైకోర్టు. అన్ని సెట్ చేసి ట్రాప్ చేశామన్నారు ఏజీ. ప్రతి కేసులో నిందితుడికి 41a crpc నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదన్నారు ఏజీ.
Read Also: Ts Highcourt: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేపటికి వాయిదా
వేదుల శ్రీనివాస్ నిందితుల తరపు న్యాయవాది తమ పిటిషనర్ల పై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎలాంటి నగదు సంఘటన స్థలం వద్ద దొరకలేదు..హై ప్రొఫెషనల్ కేసులో ప్రతి ఒక్కరికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలి..అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో చాలా అంశాలు పొందుపరచారు. ఈరోజు సాయంత్రం వరకు అరెస్ట్ అయినా ముగ్గురు అడ్రస్ లు సీపీ కి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలిచ్చింది. 24 గంటల పాటు నిందితులు ఎటు వెళ్ళడానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. కేసు వివరాలు అఫిడవిట్స్ అన్ని ప్రతివాదులకు ఇవ్వాలని ఏజీ కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై రేపు ఆదేశాలు జారీచేస్తామంది హైకోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?