మండలి ప్రొటెం ఛైర్మన్గా భూపాల్రెడ్డి.. గుత్తాతో భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్… చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పదవులు ఖాళీ కావడంతో ప్రొటెం చైర్మన్ను గవర్నర్ నియమించారు. మండలికి చైర్మన్ను ఎన్నుకునే వరకు భూపాల్ రెడ్డి ఆ పదవిలో కొనసాగనున్నారు. కొత్తగా ఎన్నికయ్యే మండలి సభ్యుల చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించడం, కొత్త చైర్మన్ను ఎన్నుకోవటం, ఇతర మండలి వ్యవహారాలు చూసుకొంటారు. సాధారణ చైర్మన్, స్పీకర్కు ఉండే అన్ని అధికారాలుంటాయి. ఎస్కార్ట్, ప్రొటోకాల్, జీతభత్యాలు, బంగ్లా సౌకర్యాలు కూడా ఉంటాయి.. ఇక, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్తో పాటు మరో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ఇవాళ్టితో ముగిసిపోయింది.. మరోవైపు.. గుత్తా సుఖేందర్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ప్రొటెం చైర్మన్ గా నియమితులైన వెన్నవరం భూపాల్ రెడ్డి.. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి గారికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
Also Read
తాజావార్తలు
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
-
Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!