Balka Suman: షర్మిలకు బాల్కసుమన్ వార్నింగ్.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే టీఆర్ఎస్ బాధ్యత వహించదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman: వైఎస్ఆర్ టీపీ షర్మిల పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హైద్రాబాద్ టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పై షర్మిల విషం కక్కుతోందని మండిపడ్డారు. సంస్కార హీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా షర్మిల మాట్లాడితే టీఆర్ఎస్ బాధ్యత వహించదన్నారు. అడ్డగోలుగా మాట్లాడే భాషే ఇందుకు కారణం కానుందని బాల్క సుమన్ తెలిపారు. తమ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై జరిగిన దాడి గురించి గవర్నర్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తమను షర్మిల దూషించిన విషయం కూడా గవర్నర్ తెలియనట్టుందన్నారు. సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నా ఏం మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. ఎవరిని పడితే ఏది పడితే మాట్లాడితే ఎలా అని సుమన్ అడిగారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నల్లి లాగా నలిపివెస్తం అన్నారు. మేము అనుకుంటే షర్మిల ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదని వార్నింగ్ ఇచ్చారు. సర్పంచ్ గా కూడా గెలవని షర్మిల బతుకెంతా? అంటూ ప్రశ్నించారు. షర్మిల ఏ పక్షమే ఎవరెవరికి తెలుసు? అని అన్నారు. ఏపీ సీఎం జగన్, వైఎస్ఆర్ టీపీ షర్మిల తెలంగాణను వ్యతిరేకించారు దాని ఫ్రూఫ్ కూడా వీడియోలు ఉన్నాయని మీడియా ముందు పెట్టారు.
Reada also: Andhra Pradesh: ఎన్నికల విధుల నుంచి టీచర్లు అవుట్.. మరి ఎవరు నిర్వహిస్తారు?
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణలో తిరుగుతూ తమనే దూషిస్తున్నారన్నారు. తెలంగాణ పోరాటం గురించి షర్మిలకు ఏం తెలుసో చెప్పాలన్నారు. పరాయి మనుషులు కిరాయి మనుషులతో తెలంగాణలో చేస్తున్న తోలుబొమ్మలాటను పెద్దగా పట్టించుకోవాల్సిన అవససరం లేదని బాల్క సుమన్ చెప్పారు. షర్మిల ఎవరు, ఆమె వెనుక ఉన్న వారెవరో తెలంగాణ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సుమన్ కోరారు.అడ్డగోలుగా షర్మిల మాట్లాడుతున్న తీరును కూడా ప్రజలు గమనించాలన్నారు. ఓపిక సహనం నషిస్తా ఉంది,మా క్యాడర్ కు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిషత్ లో ఏమి జరిగిన బాధ్యత మాది కాదు.. టీఆర్ఎస్ ది కాదు అంటూ మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఏమి జరిగినా వాల్లే బాధ్యులు అని తెలిపారు. చిల్లర వాళ్ళను పట్టించుకోమమి సంచళన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కు కవిత ఇంటి మీదకు వచ్చినప్పుడు కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే లపై షర్మిల మాట్లాడినప్పుడు గవర్నర్ కు కనిపించడం లేదా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు బాల్కా సుమన్.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం