Jagga Reddy: టీఆర్ఎస్, బీజేపీది మైండ్ గేమ్.. 12 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్కి గిఫ్ట్ ఇవ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాలని టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందన్న ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ కుట్ర రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు అని టీఆర్ఎస్-బీజేపీ ప్లాన్ వేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు.. సీఎం కేసీఆర్ పరిపాలనలో విఫలం అయ్యారని విమర్శించారు జగ్గారెడ్డి.. అడిగారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణకి పూర్తి సమయం ఇస్తామని రాహుల్ గాంధదీ తెలిపినట్టు వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో ప్రజల ఆకాంక్షలు అమలు కాలేదన్నారు జగ్గారెడ్డి.
Read Also: Jagga Reddy: పోలీసులపై దండ యాత్ర.. రేపు ఖమ్మం వెళ్తున్నాం-జగ్గారెడ్డి
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు జగ్గారెడ్డి.. వరికి గిట్టుబాటు ధర లేదు.. వరి వేయొద్దు అని కేసీఆరే అనడం 40 శాతం వరి వేయలేదని.. ఈ విషయంలోనూ బీజేపీ-టీఆర్ఎస్ దాగుడు మూతల ఆట ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, బండి సంజయ్ పనికి మాలిన మాటలు మాట్లాడతారు.. కేసీఆర్ తియ్యటి మాటలు చెబుతారు.. ఇద్దరితో రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి.. వరి వేయని రైతుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించిన ఆయన.. ఆ రైతుల పొట్ట కొట్టింది టీఆర్ఎస్-బీజేపీయే అని ఆరోపించారు.. బండి సంజయ్ కి తు.. తెలియదు..తా తెలియదని సెటైర్లు వేసిన జగ్గారెడ్డి.. టీవీలను పిలిచి భౌభౌ అని అరుస్తారని.. రాజకీయం చేసేది అంతా సెంట్రల్ బీజేపీయే అన్నారు.. బీజేపీకి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా పరవాలేదు.. కానీ, కాంగ్రెస్ రావద్దని కుట్ర చేస్తుందని ఆరోపించారు. మరోవైపు, వరంగల్లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు రైతులు, నిరుద్యోగులు అంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ బలోపేతం అవుతుందని.. ఐదు లక్షల మందితో రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తామన్నారు.. ఇక, తెలంగాణ నుండి 12 ఎంపీ సీట్లను గెలిపించి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వాలని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!