Traffic diversion: నగరంలో ట్రాఫిక్ డైవర్సన్.. గంట ముందే బయలు దేరండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic diversion: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. దీంతో సికింద్రాబాద్ పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. చాలా రోడ్లు పూర్తిగా మూసివేయబడతాయి. మరికొన్ని చోట్ల వాహనాలను దారి మళ్లిస్తారు.
ఇటు వెల్లండి..
Also Read
మోనప్ప జంక్షన్, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్నగర్, రసూల్పురా CTO, ఫ్లాజా, SBH, YMCA, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, అలుగడబావి, చిలకలగూడ జంక్షన్, MJ రోడ్, RP రోడ్, SP రోడ్డు చాలా రద్దీగా ఉన్నాయి. జంక్షన్ల వైపు వెళ్లవద్దని సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లే వారు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే స్టేషన్కు చేరుకోవాలని పోలీసులు తెలిపారు. ఉప్పల్-సికింద్రాబాద్ మార్గంలో కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
1. టివోలి ఎక్స్ రోడ్స్ నుండి ఫ్లాజా ఎక్స్ రోడ్ వరకు ఇరువైపులా మూసివేయబడతాయి.
2. ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి స్వీకర్.. ఉపకార్ జంక్షన్ వరకు ఇరువైపులా రహదారిని మూసివేస్తారు.
3. చిలకలగూడ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, రెటిఫైల్ టి జంక్షన్ నుంచి వచ్చే ప్యాసింజర్ వాహనాలను అనుమతించరు. ప్రయాణికులు క్లాక్ టవర్ పాస్పోర్ట్ ఆఫీస్, రెజిమెంటల్ బజార్ మార్గంలో సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ గేట్కు చేరుకోవాలి.
4. కరీంనగర్ వైపు నుంచి రాజీవ్ రహదారి మీదుగా నగరానికి వచ్చే వారు ఓఆర్ ఆర్ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
5. కీసర ఓఆర్ఆర్ గేటు నుంచి ఈసీఐఎల్, మౌలాలి, నాచారం, ఉప్పల్ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
6. తిరుమలగిరి క్రాస్ రోడ్డు నుంచి ఎడమవైపునకు వెళ్లి ఏఎస్రావునగర్, ఈసీఐఎల్, మౌలాలి, తార్నాక నుంచి నగరంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలి.
7. కరీంనగర్ వైపు వెళ్లే వారు తిరుమలగిరి క్రాస్రోడ్, జేబీఎస్ మార్గాల్లో కాకుండా ఓఆర్ఆర్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
గంట ముందే బయలు దేరండి..
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. దీంతో పదో తరగతి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్లో చిక్కుకుపోతే పరీక్షకు ఆలస్యంగా వచ్చే ప్రమాదం ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా ఎస్ఎస్సీ, ఏఎస్సీ పరీక్షలు ఉన్నందున అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు.
Harry Brook: టెస్టులాడే వ్యక్తికి కోట్లు కుమ్మరించారు..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!