Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 01 09 2025

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :September 1, 2025 , 9:13 pm
By Gogikar Sai Krishna
  • ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..
  • ఒక్క మ్యాచ్‌లో 27 సిక్సర్లు.. రింకు సింగ్ వీరవిహారం..
  • బీఆర్‌ఎస్‌ అధికారిక వాట్సప్‌ గ్రూపుల నుంచి కవిత పీఆర్‌వో తొలగింపు
  • నిమ్స్‌లో ఉచిత గుండె ఆపరేషన్లు..!
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’.. బీజేపీకి రాహుల్ గాంధీ వార్నింగ్..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్‌లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 65 లక్షల మంది ఓటు హక్కును అక్రమంగా తొలగించారంటూ రాహుల్ గాంధీ గతంలో ఆరోపిస్తున్నారు.

Also Read

  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
Add as a preferred
source on google

ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..

కేరళలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్లు ఈ సారి పోలీసులనే టార్గెట్ చేశారు. పోలీసులను మోసం చేసేందుకు జిల్లా పోలీస్ అధికారి ప్రథీప్ టి.కే. పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ ను ఏర్పాటు చేసి.. పోలీసుల నుంచే డబ్బులు అడిగేందుకు యత్నించాడు. దీనికి సంబంధించి జిల్లాలోని కొందరు అధికారులకు వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ లు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇందులో ఓ ఉన్నతాధికారి ఫోటోను ప్రొఫైల్ ఫిక్ గా పెట్టి.. వేరే వారి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు.

యూఎన్ సిబ్బందిని బంధించిన హౌతీలు.. బందీలు ఎందరంటే..

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హౌతీల ప్రధానమంత్రితో సహా అనేక మంది సీనియర్ కమాండర్లు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు రాజధాని సనా, హుదేయిదా అనే ఓడరేవు పట్టణంపై దాడి చేశారు. ఆదివారం ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి 11 మంది ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడి తర్వాత ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయని యెమెన్ భద్రతా అధికారులు చెప్పారు.

నిమ్స్‌లో ఉచిత గుండె ఆపరేషన్లు..!

మన సమాజంలో అత్యంత బాధ కలిగించే నిజం ఏమిటంటే, పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో చిన్నారులు బాధపడటం. ఆర్థికంగా బలమైన కుటుంబాలు పెద్ద ఆసుపత్రుల్లో ఆధునిక చికిత్స పొందగలిగినా, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రాణాలను కాపాడటానికి ఆర్థిక సహాయం కోసం ఇతరులను వేడుకోవాల్సి వస్తోంది.

సీబీఐ వద్ద పెండింగ్‌లో 7 వేలకు పైగా కేసులు..

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వద్ద పెండింగ్‌లో 7,072 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తాజాగా విడుదలైన కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 31, 2023 నాటికి ఈ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 379 హైప్రొఫైల్ కేసులు ఉన్నట్లుగా చెప్పింది. ఇవి 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 1,056 కేసులు దర్యాప్తు దశలో ఉండగా, మిగతా 6,016 కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. ఈ నివేదికను సీబీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) సమర్పించింది.

బీఆర్‌ఎస్‌ అధికారిక వాట్సప్‌ గ్రూపుల నుంచి కవిత పీఆర్‌వో తొలగింపు

ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ పార్టీలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కవిత పీఆర్‌వోను పార్టీ అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి తొలగించినట్లు సమాచారం. పార్టీ అంతర్గతంగా ఆమెపై వ్యతిరేక వాతావరణం పెరుగుతోందని ఇదే సంకేతమని భావిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికల్లోనూ కవితకు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఎక్స్‌ (ట్విట్టర్‌), ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లను ఫాలో అవుతున్న పలువురు నేతలు, కీలక కార్యకర్తలు అన్‌ఫాలో చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని, ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కవిత చేసిన ఆరోపణలు, పార్టీ లోపల తలెత్తుతున్న విభేదాలు బీఆర్‌ఎస్‌ భవిష్యత్తుపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.

కీలక నిర్ణయం.. వరద బాధితులకు పరిహారం ఆదేశాలు

భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం మీద ఆయన ఆరా తీసుకున్నారు. సీఎం అధికారులు తక్షణమే కేంద్రానికి వివరాలు అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని చెరువుల పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం పేర్కొన్నారు. పంటలకు వచ్చిన నష్టం అంచనా వేయించి, తక్షణమే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వరదల సమయంలో గల నైపుణ్యాలను మరింత పెంపొందించాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ తో పని లేకున్నా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు.

‘‘భారత్ చాలా ఆలస్యం చేసింది’’.. సుంకాలపై ట్రంప్ బిగ్ కామెంట్స్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా 50 శాతం సుంకాలనున విధించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.

ఒక్క మ్యాచ్‌లో 27 సిక్సర్లు.. రింకు సింగ్ వీరవిహారం..

యూపీ టీ20 లీగ్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మ్యాచ్‌లు జరిగే కొద్ది నయా రికార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ లీగ్‌లో మనం ఓ హీరో గురించి మాట్లాడుకోవాలి.. ఆయనే రింకు సింగ్. యూపీ టీ20 లీగ్‌లో రింకు సింగ్ ఆధిపత్యం కొనసాగుతుంది. తాజాగా ఆగస్టు 31న నోయిడా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఇదే మ్యాచ్‌లో నయా సంచలనం స్వస్తిక్ చికారా సిక్సర్లతో విరుచుకుపడ్డారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • harish rao
  • kcr

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions