తెలంగాణ రైతులు వేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలు ఇవే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందంటోంది వ్యవసాయ శాఖ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూన్నారు ఉద్యానవన శాఖ అధికారులు.దేశవ్యాప్తంగా కూరగాయలకు రోజురోజుకు డిమాండ్ పెరుతుంది. కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలో ఉద్యానవన శాఖ అధికారులు ఏయే కూరగాయలు సాగు చేస్తే లాభం చేకూరుతుంది అనే దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువగా టమాటా, మిర్చి వంటి కురాగాయలతో పాటు ఆకుకూరలకు చాలా డిమాండ్ ఉంటుంది.
కాబట్టి వాటి సాగు కావాల్సిన మెలకువలు రైతులకు అందిస్తోంది వ్యవసాయ, ఉద్యానవన శాఖ. రాష్ట్ర జనాభాకు కావల్సినన్ని కూరగాయలు రాష్ట్రంలోని రైతులు పండించడం లేదని అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాటా, ఇతర కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో వినియోదారులకు భారం పడుతోంది అని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. మన రాష్ట్రంలో టమాటా వంటి కూరగాయలు పండించేందుకు 40 శాతం అనువైన ఎర్ర నేలలు వున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఇతర ఆయిల్ ఫామ్, పప్పు దినుసుల వంటి వాటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది.యాసంగిలో కూరగాయల సాగు చేస్తే రైతుకు మరింత లాభం చేకూరుతుంది. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది తెలంగాణ.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
అయితే అక్కడ వాతావరణ మార్పుల వలన చాలా సార్లు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల ఏపీ, కర్ణాటక, తమిళనాడులో వర్షలా వలన టమాటా రేటు ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఎక్కువగా ఏపీ మదనపల్లె నుండి టమాటా దిగుమతి అవుతుంది. అక్కడ భారీ వర్షాలతో పంటలు పాడవడంతో కూరగాయల రేట్లు కొనలేనంతగా పెరిగాయి. కాబట్టి రాష్ట్ర అవసరాలకు కావాల్సిన కూరగాయలు మనమే పండిస్తే ఇటు రైతుకు అటు వినియోదారునికి మేలు జరుగుతుందని అధికారులు అంటున్నారు ఉద్యానవన అధికారులు.వ్యవసాయ శాఖ యాసంగి సాగుకు అనుకూలమైన 10 పంటలను ప్రతిపాదిస్తూ ఇటీవల ప్రణాళిక విడుదల చేసింది. పల్లి, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమలు, పెసర్లు, ఆముదం, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న వేయాలని రైతులకు విజ్ఞప్తి చేసింది. అయితే యాసంగిలో వరి సాగు విస్తీర్ణం రెండేళ్లుగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇంత అసాధారణ స్థాయిలో యాసంగిలో వరి సాగైన సందర్భాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 31 లక్షల ఎకరాలకు పెరిగిందని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!