తెలంగాణ రైతులు వేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలు ఇవే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందంటోంది వ్యవసాయ శాఖ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూన్నారు ఉద్యానవన శాఖ అధికారులు.దేశవ్యాప్తంగా కూరగాయలకు రోజురోజుకు డిమాండ్ పెరుతుంది. కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలో ఉద్యానవన శాఖ అధికారులు ఏయే కూరగాయలు సాగు చేస్తే లాభం చేకూరుతుంది అనే దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువగా టమాటా, మిర్చి వంటి కురాగాయలతో పాటు ఆకుకూరలకు చాలా డిమాండ్ ఉంటుంది.
కాబట్టి వాటి సాగు కావాల్సిన మెలకువలు రైతులకు అందిస్తోంది వ్యవసాయ, ఉద్యానవన శాఖ. రాష్ట్ర జనాభాకు కావల్సినన్ని కూరగాయలు రాష్ట్రంలోని రైతులు పండించడం లేదని అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాటా, ఇతర కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో వినియోదారులకు భారం పడుతోంది అని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. మన రాష్ట్రంలో టమాటా వంటి కూరగాయలు పండించేందుకు 40 శాతం అనువైన ఎర్ర నేలలు వున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఇతర ఆయిల్ ఫామ్, పప్పు దినుసుల వంటి వాటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది.యాసంగిలో కూరగాయల సాగు చేస్తే రైతుకు మరింత లాభం చేకూరుతుంది. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది తెలంగాణ.
Also Read
అయితే అక్కడ వాతావరణ మార్పుల వలన చాలా సార్లు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల ఏపీ, కర్ణాటక, తమిళనాడులో వర్షలా వలన టమాటా రేటు ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఎక్కువగా ఏపీ మదనపల్లె నుండి టమాటా దిగుమతి అవుతుంది. అక్కడ భారీ వర్షాలతో పంటలు పాడవడంతో కూరగాయల రేట్లు కొనలేనంతగా పెరిగాయి. కాబట్టి రాష్ట్ర అవసరాలకు కావాల్సిన కూరగాయలు మనమే పండిస్తే ఇటు రైతుకు అటు వినియోదారునికి మేలు జరుగుతుందని అధికారులు అంటున్నారు ఉద్యానవన అధికారులు.వ్యవసాయ శాఖ యాసంగి సాగుకు అనుకూలమైన 10 పంటలను ప్రతిపాదిస్తూ ఇటీవల ప్రణాళిక విడుదల చేసింది. పల్లి, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమలు, పెసర్లు, ఆముదం, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న వేయాలని రైతులకు విజ్ఞప్తి చేసింది. అయితే యాసంగిలో వరి సాగు విస్తీర్ణం రెండేళ్లుగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇంత అసాధారణ స్థాయిలో యాసంగిలో వరి సాగైన సందర్భాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 31 లక్షల ఎకరాలకు పెరిగిందని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!