సింగరేణి సమ్మెకు బ్రేకులు.. తిరిగి విధుల్లోకి కార్మికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణిలో మూడు రోజుల సమ్మె ముగిసింది.భూగర్భ గనులతోపాటు ఓపెన్ కాస్టుల్లో పనిచేసే కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.మంచిర్యాల ,కొమురం భీం జిల్లాల్లోని బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్ ఏరియల్లో సమ్మె కారణంగా గనులు బోసిపోయాయి. 72 గంటలపాటు సాగిన సమ్మెలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం, జాతీయ కార్మిక సంఘాలు AITUC, INTUC, HMS, BMS, CITU లు సమ్మెలో పాల్గొన్నాయి.
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు 12 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ తో సమ్మె సాగింది…బెల్లంపల్లి రీజియన్ లలో 11 భూగర్బ గనులు, 5 ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తికి నిలిచిపోయింది..ఈ రీజియన్లో మూడు రోజుల్లో 62 కోట్ల నష్టం వాటిల్లగా, సింగరేణి వ్యాప్తంగా మొత్తం రోజు 1.5 లక్షల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోగా మూడు రోజుల్లో నాలుగున్నర లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, మొత్తం 120 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సింగరేణి సంస్థ ప్రకటనలో తెలిపింది.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి సంస్థ కొత్తగా బొగ్గు బ్లాక్ ల ఏర్పాట్లుకు సన్నాహాలు చేస్తుంది.తెలంగాణ వ్యాప్తంగా సింగరేణిలో నాలుగు బ్లాక్ ల ప్రైవేటీకరణ చేయనుంది. అయితే ఈ బ్లాక్ ల సర్వే కోసం సింగరేణి అరవై కోట్లు ఖర్చు చేసింది. దీనికితోడు ఇతర రాష్ర్టాల్లో కూడా బొగ్గు బ్లాక్ లను తవ్వడానికి సింగరేణి ప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పుడు ఉన్న బ్లాకు లనే ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని సింగరేణిలో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థను కాపాడుకోవడం కోసం, మనుగడ కోసమే అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఒక్క భద్రాద్రి జిల్లాలోనే సింగరేణి సంస్థలకు వంద కోట్ల కు పైగా బొగ్గు ఉత్పత్తి పై ప్రభావం పడింది.
జిల్లాలోని ఇల్లెందు, మణుగూర్, కొత్తగూడెం ఏరియాలలోని అన్ని ఓపెన్ కాస్టులు, అండర్ గ్రౌండ్ గనులు మూత పడ్డాయి. కార్మికులు ఎవ్వరు విధులకు హాజరుకాలేదు. మణుగూరులో పూర్తి స్థాయిలో కార్మికులు.. సమ్మెలో పాల్గొనటం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి. దీంతో మూడ్రోజుల్లో సుమారు 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం జరిగింది. సింగరేణి కార్మికులకు సమ్మెకు మద్దతుగా భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ గని వద్ద TBGKS సంఘం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు భూపాలపల్లిలోని వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు..భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు భూపాలపల్లి డివిజన్ పరిధిలో 21 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిపోగా,సింగరేణి సంస్థ కు సుమారు 51 కోట్ల నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు తెలిపారు.
- Tags
- bjp
- Singareni strike
- telangana
- TRS
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..