Temples Robberies: ఆలయాలే టార్గెట్.. ఏడాదిన్నర కాలంలో మూడు సార్లు చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Temples Robberies: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. దేవాలయాలే టార్గెట్ గా.. ఏడాదిన్నర కాలంలో మూడు సార్లు ఆలయాల్లో చోరీలు జరిగాయి. తాజాగా మండలంలోని రెండు ఆలయాల్లో గత రాత్రి చోరీ జరిగింది. ఏకశిల పాంబండ రామలింగేశ్వర దేవాలయం ఆవరణలోని అమ్మవారి గుడి గ్రిల్ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టారు. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు.ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లిన ఆలయ సిబ్బంది దొంగతనాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు దుప్పట్లు కప్పుకుని స్విఫ్ట్ కారులో వచ్చి ఆలయ పరిసరాల్లో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Read also: Making Chicken Pizza : చికెన్ పిజా ఇంట్లోనే చేసుకోండిలా …
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
గతంలో ఆలయంలో చోరీకి మూడుసార్లు విఫలయత్నాలు జరిగాయి. ఇది ఇలా ఉండగా కుల్కచర్ల మండలం దాస్యానాయక్ తండాలోని సేవాలాల్ ఆలయంలో కూడా చోరీ జరిగింది.ఉదయం ఏడు గంటల సమయంలో ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణాధికారి దొంగతనాన్ని గమనించి తండా వాసులకు సమాచారం అందించారు. అమ్మవారి ఆలయంతో పాటు సేవాలాల్ ఆలయ తాళాలు పగులగొట్టి హుండీలు, విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు తండా వాసులు గుర్తించారు. రాత్రి 1 గంట సమయంలో కొందరు కారులో వచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మండల కేంద్రంలో దేవాలయాలే లక్ష్యంగా చోరీలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Ayesha Meera Mother: నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం తేవాలి
తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..