Ayesha Meera Mother: నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం తేవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayesha Meera Mother: విజయవాడలో అయేషా మీరా హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఇంకెన్నాళ్లు’ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయేషా మీరా తల్లి శంషాద్ బేగం మాట్లాడుతూ.. అయేషా హత్యకు గురై 15 ఏళ్లు అయ్యిందని.. ఐపీఎస్ అధికారి ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కేసును తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. సత్యం బాబును అరెస్టు చేసినా కోర్టులో దోషిగా నిర్ధారించలేదన్నారు. 2018 డిసెంబరులో కేసు సీబీఐ స్వీకరించిందని.. తమను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్ఏ టెస్ట్ చేయించారని.. తమ దగ్గర ఉన్న అన్నీ వివరాలు సీబీఐకి ఇచ్చామన్నారు. తమ మత పెద్దలు నాడు రీ పోస్ట్ మార్టం కోసం అంగీకరించలేదని.. ఆ తరువాత కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్ మార్టం చేశారని వివరించారు.
Read Also: Anchor Suma: కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. యాంకరింగ్కు బ్రేక్..?
Also Read
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
మూడేళ్లుగా తమ పాప శరీర భాగాలు కూడా వెనక్కి ఇవ్వలేదని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును బైఫర్ కేషన్ చేశామని అధికారులు అంటున్నారని.. సీబీఐ కూడా అవినీతిమయం అయిపోయిందని విమర్శలు చేశారు. అందుకే తాము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అసలైన దోషులకు శిక్ష పడి న్యాయం జరిగే వరకు ముందుకు సాగుతామన్నారు. తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో అయేషా హత్య జరిగిందన్నారు. అందువల్ల జగన్ ఇప్పుడు నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం చేయాలని కోరారు. నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం వైపు సహకారం అందించాలన్నారు.
అయేషా హత్యపై న్యాయ పోరాట సమితి పేరుతో పోరాటం చేస్తున్నామని గంగా భవానీ వెల్లడించారు. 2007లో చనిపోయిన నాటి నుంచి 2019 వరకు అనేక శాఖల అధికారులు దర్యాప్తు చేశారని.. సీబీఐ విచారణ చేసినా దోషులు పట్టుకోలేక పోయారన్నారు. వారు ఎవరి ఒత్తిడులకు లొంగారో తేల్చాలన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం కూడా అందించలేదన్నారు. మోదీ, జగన్ ప్రభుత్వాలపై తమకు నమ్మకం లేదన్నారు. అందుకే సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రజా సంఘాలు కూడా తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!