Tummala Nageswara Rao : కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్
- యూరియా సరఫరాపై కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
- కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం.. తుమ్మల ఖండన
- ప్రతిపక్ష పార్టీలపై మంత్రి విమర్శలు
- రైతాంగ శ్రేయస్సు కోసం ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao : తెలంగాణలో యూరియా కొరతపై కేటీఆర్ విమర్శలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఈ వారంలోనే రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన ఆందోళన ఫలితంగా ఈ చర్యలు ప్రారంభమయ్యాయని తుమ్మల వ్యాఖ్యానించారు. కోరమాండల్ ఇంటర్నేషనల్కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి, మూడు షిప్మెంట్లలో యూరియా సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు.
Kamal – Rajni వారసున్ని ప్రకటించిన వెంటనే రజనీ- కమల్ సినిమా?
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
యూరియా కొరతపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమైనవి అని తుమ్మల తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బఫర్ స్టాక్స్ లేకపోవడం వాస్తవం కాదని, యూరియా సరఫరాలో జరిగిన ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వ జాప్యం కారణమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ, చెప్పుల క్యూ లైన్ డ్రామా లాంటి కార్యక్రమాలతో మభ్యపెడుతున్నాయని విమర్శించారు. తుమ్మల వివరాల ప్రకారం, తెలంగాణ రైతాంగానికి మొత్తం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు జరిగింది.
అందులో 2.10 లక్షల టన్నుల కొరత ఇంకా కొనసాగుతుందని, ముఖ్యంగా ఈ నెలలో వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా 80 వేల టన్నులు అవసరమవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలను కూడా తుమ్మల తప్పుబట్టారు. అవి రైతాంగ సమస్యలపై అవగాహన రాహిత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. “సవాళ్లు విసరడం కాదు, సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే ముఖ్యమని” తుమ్మల స్పష్టం చేశారు. రైతాంగ శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..