Tummala Nageswara Rao : కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్
- యూరియా సరఫరాపై కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
- కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం.. తుమ్మల ఖండన
- ప్రతిపక్ష పార్టీలపై మంత్రి విమర్శలు
- రైతాంగ శ్రేయస్సు కోసం ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao : తెలంగాణలో యూరియా కొరతపై కేటీఆర్ విమర్శలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఈ వారంలోనే రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన ఆందోళన ఫలితంగా ఈ చర్యలు ప్రారంభమయ్యాయని తుమ్మల వ్యాఖ్యానించారు. కోరమాండల్ ఇంటర్నేషనల్కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి, మూడు షిప్మెంట్లలో యూరియా సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు.
Kamal – Rajni వారసున్ని ప్రకటించిన వెంటనే రజనీ- కమల్ సినిమా?
Also Read
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
యూరియా కొరతపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమైనవి అని తుమ్మల తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బఫర్ స్టాక్స్ లేకపోవడం వాస్తవం కాదని, యూరియా సరఫరాలో జరిగిన ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వ జాప్యం కారణమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ, చెప్పుల క్యూ లైన్ డ్రామా లాంటి కార్యక్రమాలతో మభ్యపెడుతున్నాయని విమర్శించారు. తుమ్మల వివరాల ప్రకారం, తెలంగాణ రైతాంగానికి మొత్తం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు జరిగింది.
అందులో 2.10 లక్షల టన్నుల కొరత ఇంకా కొనసాగుతుందని, ముఖ్యంగా ఈ నెలలో వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా 80 వేల టన్నులు అవసరమవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలను కూడా తుమ్మల తప్పుబట్టారు. అవి రైతాంగ సమస్యలపై అవగాహన రాహిత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. “సవాళ్లు విసరడం కాదు, సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే ముఖ్యమని” తుమ్మల స్పష్టం చేశారు. రైతాంగ శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ragi Punugulu – Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Peddi: నైజాంలో రామ్ చరణ్ ‘పెద్ది’కి బిగ్ షాక్
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!