Telangana Rising Global Summit : గ్లోబల్ సమ్మిట్ పై రాజకీయ రగడ
- 2047 విజన్తో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
- అభివృద్ధి వేదికగా సమ్మిట్కు ప్రభుత్వం యత్నం
- జిమ్మిక్ అంటూ బీజేపీ తీవ్ర విమర్శలు
- సమ్మిట్ ముందే మొదలైన రాజకీయ రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rising Global Summit : తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయనున్నారు. ఈ కీలకమైన సదస్సును రాజకీయాలకు అతీతంగా జరపాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇందులో భాగంగా, సమ్మిట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆహ్వానించినవారందరూ ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అవుతుందని అభినందించారని, తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
అయితే, ఈ సమ్మిట్ ప్రారంభానికి ముందే తీవ్ర రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి ఎలాంటి వ్యతిరేకత కనిపించకపోయినా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ నేతలు ఈ గ్లోబల్ సమ్మిట్ను కేవలం ఒక జిమ్మిక్ గా కొట్టిపారేస్తున్నారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి మరల్చడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శిస్తూ, తెలంగాణ దేంట్లో రైజింగ్ లో ఉందో చెప్పాలని నిలదీశారు. వాస్తవానికి, తెలంగాణ గన్ కల్చర్, అవినీతి మరియు డ్రగ్స్ కల్చర్లో మాత్రమే రైజింగ్ లో ఉందని, అందుకే తెలంగాణ రైజింగ్ కాదు, సికింగ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ రకంగా రాష్ట్ర ప్రజలను భ్రమింపజేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలకు సైతం సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసి, సమ్మిట్కు ఆహ్వానించినప్పటికీ, బీజేపీ నేతలు సదస్సుకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరగాలని భావించిన ఈ సదస్సుపై సోమవారం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో, సమ్మిట్ ముగిసేలోగా ఇంకెన్ని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!