Telangana Rising Global Summit : గ్లోబల్ సమ్మిట్ పై రాజకీయ రగడ
- 2047 విజన్తో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
- అభివృద్ధి వేదికగా సమ్మిట్కు ప్రభుత్వం యత్నం
- జిమ్మిక్ అంటూ బీజేపీ తీవ్ర విమర్శలు
- సమ్మిట్ ముందే మొదలైన రాజకీయ రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rising Global Summit : తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయనున్నారు. ఈ కీలకమైన సదస్సును రాజకీయాలకు అతీతంగా జరపాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇందులో భాగంగా, సమ్మిట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆహ్వానించినవారందరూ ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అవుతుందని అభినందించారని, తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
అయితే, ఈ సమ్మిట్ ప్రారంభానికి ముందే తీవ్ర రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి ఎలాంటి వ్యతిరేకత కనిపించకపోయినా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ నేతలు ఈ గ్లోబల్ సమ్మిట్ను కేవలం ఒక జిమ్మిక్ గా కొట్టిపారేస్తున్నారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి మరల్చడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శిస్తూ, తెలంగాణ దేంట్లో రైజింగ్ లో ఉందో చెప్పాలని నిలదీశారు. వాస్తవానికి, తెలంగాణ గన్ కల్చర్, అవినీతి మరియు డ్రగ్స్ కల్చర్లో మాత్రమే రైజింగ్ లో ఉందని, అందుకే తెలంగాణ రైజింగ్ కాదు, సికింగ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ రకంగా రాష్ట్ర ప్రజలను భ్రమింపజేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలకు సైతం సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసి, సమ్మిట్కు ఆహ్వానించినప్పటికీ, బీజేపీ నేతలు సదస్సుకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరగాలని భావించిన ఈ సదస్సుపై సోమవారం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో, సమ్మిట్ ముగిసేలోగా ఇంకెన్ని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!