DGP Anjani Kumar: మానవ అక్రమ రవాణా నిరోధంలో తెలంగాణ మొదటి స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Anjani Kumar: మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థీకృత నేరంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిపోయింది. మానవ అక్రమ రవణాను నిరోధించడంలో తెలంగాణ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా చేసే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తున్నారు. మానవ అక్రమ రవాణా అంశంపై తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం, బచ్పన్ బచావో ఆందోళన సంస్థ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో డీజీపీ అంజనీ కుమార్తోపాటు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణా విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. సమాజానికి ముప్పుగా పరిణమించిన మానవ, పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకై పోలీస్ శాఖతోపాటు స్వచ్ఛంద సంస్థలు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ట్రాఫికింగ్ను ఎదుర్కోవడానికి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని.. వాటిని క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా ఉపయోగించాలని డీజీపీ సూచించారు.
Read also: 2018 Movie: 2018 మూవీ ఓటిటీ క్యాన్సిల్.. ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం అదే..?
మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి నిర్వహించే అన్ని కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్ పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు పనిచేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలియజేశారు. తెలంగాణ పోలీసులు మానవ అక్రమ రవాణా పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నారని .. తద్వారా డబ్ల్యుఎస్డబ్ల్యు, ఏహెచ్టియూ విభాగాల సంయుక్త కృషితో గత రెండేళ్లలో 738 కేసులు నమోదుచేసి, 1961 మంది నిందితులను అరెస్టు చేశామని షికా గోయల్ వెల్లడించారు. అదేవిధంగా 110 మంది నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్(PD) చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో ఏహెచ్టియూ యూనిట్ పోలీసులకు సహాయం చేస్తోందన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!