Congress: యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్.. కాంగ్రెస్లో రచ్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రచ్చగా మారుతుంది.. యశ్వంత్ హైదరాబాద్ పర్యటనకు టీఆర్ఎస్ ఓన్ చేసుకుంది.. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు.. బేగంపేట్ ఎయిర్పోర్ట్కు వెళ్లి.. యశ్వంత్ సిన్హాకు ఆహ్వానం పలికారు.. ఇక, భారీ ర్యాలీ నిర్వహించింది టీఆర్ఎస్ పార్టీ.. ఆ తర్వాత జలవిహార్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. అయితే, యశ్వంత్ సిన్హా ని కలిసేది లేదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రకటించడంతో.. కొందరు సీనియర్లు తప్ప ఎవరూ అటువైపు మళ్లిచూసింది లేదు.. కానీ, ఈ విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కును తప్పుబట్టారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఇదే సమయంలో యశ్వంత్ సిన్హా అపాయింట్మెంట్ కూడా కోరారు.. భట్టి తీరుపై అధిష్టానానికి లేఖరాయనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.. కాంగ్రెస్ మద్దతు సిన్హాకి ఇచ్చినప్పుడు ఆయన ఇక్కడి వచ్చారు కాబట్టి సీఎల్పీకి పిలిస్తే బాగుండేది అని ఆయన అభిప్రాయపడుతున్నారు.
Read Also: Kolkata: పెంపుడు కుక్క సాహసం.. దొంగ నుంచి కుటుంబాన్ని కాపాడిన వైనం
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధిష్టానంతో మాట్లాడి సీఎల్పీ కి ఆహ్వానిస్తే బాగుండేది అన్నారు జగ్గారెడ్డి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించిన ఆయన.. యూపీఏలో టీఆర్ఎస్ – ఎంఐఎం భాగ్యస్వామ్యం కాకపోయినా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా ని టీఆర్ఎస్ ఆహ్వానించిందని.. కాంగ్రెస్ పార్టీ, సీఎల్పీ పక్షాన మనం కూడా యశ్వంత్ సిన్హా ని ఆహ్వహించేది ఉండే అన్నారు.. రాజకీయంగా రెండు పార్టీలు వేరు వేరు…. సిద్ధాంతాపరంగా, ప్రజా సమస్యల పై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎప్పుడు బీజేపీ ని ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో లేని టీఆర్ఎస్ ప్రభుత్వనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా ని సీఎల్పీకి పిలిపించి మద్దతు తెలిపితే బాగేంది అన్నారు. దీని పై పూర్తిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని తప్పు పడుతూ ఢిల్లీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు.. అంతే కాదు, యశ్వంత్ సిన్హా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నా.. దొరికితే ఆయనను కలిసి మద్దతు ప్రకటిస్తానని వెల్లడించారు.. కాగా, టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఎలాంటి వేదికను పంచుకునే అవకాశం లేదని.. యశ్వంత్ సిన్హా ని కలిసేది లేదని రేవంత్రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. దీనిపై తెలంగాణ కాంగ్రెస్లో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.. మొత్తంగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్.. తెలంగాణ కాంగ్రెస్లో మరో వివాదాన్ని రాజేసినట్టు అయ్యింది.
Also Read
- Harish Rao : 'కరెంట్ ఉంటేనే వార్త'.. హరీష్ ఫైర్.!
- Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
తాజావార్తలు
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!