Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar: భారత క్రికెట్లో అత్యంత ప్రశాంతమైన, నిబద్ధత కలిగిన ఆటగాళ్లలో అజింక్య రహానే పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాట్స్మన్గా ఎన్నో కీలక ఇన్నింగ్స్లు ఆడటమే కాకుండా, టెస్ట్ కెప్టెన్గా కూడా భారత జట్టుకు మరపురాని విజయాలు అందించాడు. అయినప్పటికీ, అతనికి రావాల్సిన గుర్తింపు మాత్రం పూర్తిగా దక్కలేదని భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అజింక్య రహానే రిటైర్మెంట్ అనంతరం ఓ పత్రికలో రాసిన తన కాలమ్లో గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్గా, బ్యాట్స్మన్గా భారత జట్టుకు రహానే చేసిన సేవలను గుర్తు చేస్తూ, అతని కృషికి తగిన స్థాయిలో ప్రశంసలు దక్కలేదని పేర్కొన్నారు. భారత క్రికెట్లో ఇదే పరిస్థితి చాలామంది గొప్ప ఆటగాళ్లకు ఎదురైందని వ్యాఖ్యానించారు.
రాహుల్ ద్రవిడ్తో రహానేను పోల్చిన గవాస్కర్, ద్రవిడ్ కోచ్గా ఉన్న సమయంలో భారత్ ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించినప్పటికీ, ఆయనకు రావాల్సిన గుర్తింపు కూడా పూర్తిగా రాలేదని గుర్తు చేశారు. జట్టు విజయం సాధించినప్పుడు వ్యక్తిగతంగా రాణించిన ఆటగాళ్లే ఎక్కువ ప్రశంసలు అందుకుంటారని, కానీ ఓటమి ఎదురైతే కెప్టెన్, కోచ్లపై విమర్శలు కేంద్రీకృతమవుతాయని భారత క్రికెట్ సంస్కృతిపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇక, టెస్ట్ కెప్టెన్గా అజింక్య రహానే రికార్డు అద్భుతమని గవాస్కర్ కొనియాడారు. రహానే నాయకత్వంలో భారత్ ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలు సాధించగా, ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. అయినప్పటికీ, అతని నాయకత్వానికి దక్కాల్సిన స్థాయిలో ప్రశంసలు రాలేదని అన్నారు.
Also Read
- India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
2020-21 ఆస్ట్రేలియా పర్యటనను ప్రస్తావిస్తూ గవాస్కర్ ఆసక్తికర విషయాలను గుర్తుచేశారు. అడిలైడ్ టెస్టులో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ కావడం జట్టుకు భారీ ఎదురుదెబ్బగా మారిందన్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన తొలి సంతానం సందర్భంగా స్వదేశానికి తిరిగి రావడంతో రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారని చెప్పారు. మెల్బోర్న్ టెస్టులో రహానే అద్భుతమైన సెంచరీతో జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపారని, పలువురు కీలక ఆటగాళ్లు గాయపడినా యువ ఆటగాళ్లను సమర్థంగా నడిపించి ఆస్ట్రేలియాలోని గబ్బా మైదానంలో చిరస్మరణీయ విజయాన్ని అందించి 2-1తో సిరీస్ను భారత్ కైవసం చేసుకునేలా చేశారని కొనియాడారు.
రహానే వ్యక్తిత్వాన్ని కూడా గవాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన సుదీర్ఘ కెరీర్లో మైదానంలో ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోకుండా అందరి గౌరవాన్ని సంపాదించుకున్న అరుదైన ఆటగాళ్లలో రహానే ఒకరని పేర్కొన్నారు. ప్రపంచ క్రికెట్లో తమ కెరీర్ మొత్తం ముగిసే వరకు ఒక్క శత్రువును కూడా సంపాదించుకోని ఆటగాళ్లు చాలా తక్కువమందే ఉంటారని, ఆ జాబితాలో అజింక్య రహానే స్థానం ప్రత్యేకమని అన్నారు. అందుకే రహానే తలెత్తుకుని గర్వంగా క్రికెట్కు వీడ్కోలు చెప్పగలిగాడని గవాస్కర్ తన కాలమ్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!