Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar: భారత క్రికెట్లో అత్యంత ప్రశాంతమైన, నిబద్ధత కలిగిన ఆటగాళ్లలో అజింక్య రహానే పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాట్స్మన్గా ఎన్నో కీలక ఇన్నింగ్స్లు ఆడటమే కాకుండా, టెస్ట్ కెప్టెన్గా కూడా భారత జట్టుకు మరపురాని విజయాలు అందించాడు. అయినప్పటికీ, అతనికి రావాల్సిన గుర్తింపు మాత్రం పూర్తిగా దక్కలేదని భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అజింక్య రహానే రిటైర్మెంట్ అనంతరం ఓ పత్రికలో రాసిన తన కాలమ్లో గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్గా, బ్యాట్స్మన్గా భారత జట్టుకు రహానే చేసిన సేవలను గుర్తు చేస్తూ, అతని కృషికి తగిన స్థాయిలో ప్రశంసలు దక్కలేదని పేర్కొన్నారు. భారత క్రికెట్లో ఇదే పరిస్థితి చాలామంది గొప్ప ఆటగాళ్లకు ఎదురైందని వ్యాఖ్యానించారు.
రాహుల్ ద్రవిడ్తో రహానేను పోల్చిన గవాస్కర్, ద్రవిడ్ కోచ్గా ఉన్న సమయంలో భారత్ ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించినప్పటికీ, ఆయనకు రావాల్సిన గుర్తింపు కూడా పూర్తిగా రాలేదని గుర్తు చేశారు. జట్టు విజయం సాధించినప్పుడు వ్యక్తిగతంగా రాణించిన ఆటగాళ్లే ఎక్కువ ప్రశంసలు అందుకుంటారని, కానీ ఓటమి ఎదురైతే కెప్టెన్, కోచ్లపై విమర్శలు కేంద్రీకృతమవుతాయని భారత క్రికెట్ సంస్కృతిపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇక, టెస్ట్ కెప్టెన్గా అజింక్య రహానే రికార్డు అద్భుతమని గవాస్కర్ కొనియాడారు. రహానే నాయకత్వంలో భారత్ ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలు సాధించగా, ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. అయినప్పటికీ, అతని నాయకత్వానికి దక్కాల్సిన స్థాయిలో ప్రశంసలు రాలేదని అన్నారు.
Also Read
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
- Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
2020-21 ఆస్ట్రేలియా పర్యటనను ప్రస్తావిస్తూ గవాస్కర్ ఆసక్తికర విషయాలను గుర్తుచేశారు. అడిలైడ్ టెస్టులో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ కావడం జట్టుకు భారీ ఎదురుదెబ్బగా మారిందన్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన తొలి సంతానం సందర్భంగా స్వదేశానికి తిరిగి రావడంతో రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారని చెప్పారు. మెల్బోర్న్ టెస్టులో రహానే అద్భుతమైన సెంచరీతో జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపారని, పలువురు కీలక ఆటగాళ్లు గాయపడినా యువ ఆటగాళ్లను సమర్థంగా నడిపించి ఆస్ట్రేలియాలోని గబ్బా మైదానంలో చిరస్మరణీయ విజయాన్ని అందించి 2-1తో సిరీస్ను భారత్ కైవసం చేసుకునేలా చేశారని కొనియాడారు.
రహానే వ్యక్తిత్వాన్ని కూడా గవాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన సుదీర్ఘ కెరీర్లో మైదానంలో ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోకుండా అందరి గౌరవాన్ని సంపాదించుకున్న అరుదైన ఆటగాళ్లలో రహానే ఒకరని పేర్కొన్నారు. ప్రపంచ క్రికెట్లో తమ కెరీర్ మొత్తం ముగిసే వరకు ఒక్క శత్రువును కూడా సంపాదించుకోని ఆటగాళ్లు చాలా తక్కువమందే ఉంటారని, ఆ జాబితాలో అజింక్య రహానే స్థానం ప్రత్యేకమని అన్నారు. అందుకే రహానే తలెత్తుకుని గర్వంగా క్రికెట్కు వీడ్కోలు చెప్పగలిగాడని గవాస్కర్ తన కాలమ్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!