Telangana High Court: పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. 10 మంది BRS ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేసింది. దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం, బండ్ల కృష్ణమహన్రెడ్డి, తెల్లం వెంకట్రావులపై పిటిషన్ దాఖలైంది.. ఈ పిటిషన్పై విచారణ…
Notice to Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో పార్టీ మార్పు అంశంపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. బీజేపీ ఎమ్మెల్యే నేత మహేశ్వర్ రెడ్డి దానం నాగేందర్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన నాగేందర్, తరువాత కాంగ్రెస్లో చేరడం రాజ్యాంగ విరుద్ధమని…
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానం మెట్లెక్కింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. గత సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి…
స్పీకర్ విచారణ ముగిసింది..తీర్పు మిగిలింది. తెలంగాణ అసంబ్లీ స్పీకర్ ఇన్నాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక ఎత్తు. ఆ ఒక్క ఎమ్మెల్యే విషయంలో తీసుకోబోయే నిర్ణయం మరో ఎత్తు. పది మంది పార్టీ మారితే ఒక్క శాసనసభ్యుడి విషయంలోనే ఎందుకు పీటముడి పడింది? అంత ఉత్కంఠ ఎందుకు పెరిగింది? ఆ స్థాయి సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న సదరు శాసనసభ్యుడెవరు? తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విచారణ ముగిసింది. మొత్తం పది మంది పార్టీ మారితే ఇద్దరి…
దానం నాగేందర్ ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఆయనకు క్లారిటీ లేదా…? లేక కావాలనే అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారా…? ఆయన అనర్హత పిటిషన్ విచారణలో కొత్తగా వచ్చిన ట్విస్ట్ ఏంటి? ఆ విషయమై బీఆర్ఎస్కు, బీజేపీకి ఉన్న తేడా ఏంటి? బీజేపీ ఉచ్చు ఎమ్మెల్యే మెడకు బిగుసుకుంటుందా? లెట్స్ వాచ్. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ మలుపులు తిరుగుతోంది. దీనికి సంబంధించి BRS వేసిన పిటిషన్ విచారణ ముగిసింది. అయితే… బీజేపీ పిటిషన్ విషయంలో కొన్ని…
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం తుది విచారణను పూర్తి చేశారు. సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. విచారణ అనంతరం స్పీకర్ వెలువరించిన ప్రాథమిక నిర్ణయాలు రాజకీయ…
MLA Disqualification Petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ నేటితో ముగియనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు తన ఛాంబర్లో కీలక విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రెండు కీలక పిటిషన్లపై తుది వాదనలు వినిపించబడనున్నాయి. మొదటగా కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ విచారించనున్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ను వివేకానంద దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాదనలు వినిపించగా.. ఇవాళ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై, ఆయన స్పీకర్ కు వినతిపత్రం అందజేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను దానం నాగేందర్ ఘాటుగా ఖండిస్తూ, ఆ పిటిషన్ను కొట్టి వేయాలని స్పీకర్ను కోరారు. అఫిడవిట్లో దానం నాగేందర్ తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, అలాగే పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు సమాచారమూ అధికారికంగా తనకు అందలేదని స్పష్టం చేశారు.…
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు దానం నాగేందర్. ఇక లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే.. కాంగ్రెస్ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ల విచారణ పూర్తి చేస్తే ఇక ఖేల్ ఖతం. ఈ ఇద్దరి విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. 8మంది ఎమ్మెల్యేలపై విచారణ చేసి…తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్….మరి కడియం, దానంలపై ఎలా వ్యవహరించబోతున్నారు..? ఇదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ అభ్యర్దులుగా గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం…