AP v/s TS: మమల్ని రెచ్చగొట్టద్దూ.. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP v/ TS: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. మమ్మల్ని రెచ్చగొట్టద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రం ఎంతఅభివృద్ధి చెందుతుందో ప్రజలకు తెలుసని అన్నారు. బొత్స మాట్లాడినందుకే తాము కూడా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రమని, రాజధాని ఎక్కడ ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏపీలో ఉందన్నారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్నారు. కనీసం నెలకోసారి హైదరాబాద్ రాకపోతే ప్రాణాలకు విశ్రమించదన్నారు. హైదరాబాద్, తెలంగాణపై అలా మాట్లాడటం తగదన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలపై డౌట్ ఉందని డయల్ 100కు ఫోన్ వస్తే.. ఎంక్వైరీ చేసి.. పాతళంలోకి వెళ్లి లీకేజ్ను పట్టుకున్నామని చెప్పారు.
ఆనాడు నీళ్లు, నిధుల్లో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏపీపీఎస్సీలో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ వారిని అనేక రకాలుగా అవమానించేలా మాట్లాడబోమన్నారు. అలా జరగకుంటే ఏపీ, తెలంగాణ కలిసే ఉండేదన్నారు. చూడకుండా రాస్తున్నారా?.. చూడకుండా రాస్తున్నారా? అతను అడిగాడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా మాట్లాడలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఆసుపత్రులు నిర్మించారో అందరికీ తెలుసన్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యం కోసం ఎక్కడికి వస్తారని ప్రశ్నించారు. తెలంగాణపై ఉన్న అక్కసు నేడు బయటపడిందని బొత్సకు అన్నారు. గతంలో కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. వారిని కించపరిచేలా మాట్లాడాలనుకుంటే.. చాలా మంది ఉన్నారని అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని తాము అనడం లేదన్నారు. ఏపీ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వస్తే కడుపులో పెట్టుకుంటామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
మంత్రి గంగుల…
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పై తెలంగాణ మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెచ్చుకున్న తెలంగాణ పై ఇంకా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాకముందు ఇప్పుడు వైసిపిలో ఉన్న బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ లోను మంత్రి గా ఉన్నారని గుర్తు చేశారు. అప్పుడు తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడారు.. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాక కూడా విషం చిమ్ముతున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. 297 గురుకులాలు మాత్రమే నాడు తెలంగాణ ప్రాంతంలో ఉండేవని గుర్తుచేశారు. నాడు మంత్రిగా ఉన్న ఆంధ్ర నాయకుల వైఫల్యం వల్ల ఎంతోమంది చదవలేకపోయారని అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ లో 1009 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పది లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఏపీలో 380 గురుకులాలే ఉన్నాయని అన్నారు.
అవి కూడా పదోతరగతికి మాత్రమే పరిమితం చేసారని విమర్శించారు. బొత్స సత్యనారాయణ ఇవ్వన్నీ వినాలే… ఇష్టానుసారం మాట్లాడటం కాదు… TSPSC లో తప్పు జరిగితే పట్టుకుంది ప్రభుత్వమే అన్నారు. తప్పు చేసినవారిని శిక్షిస్తున్నామన్నారు. కానీ ఏపీలో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కనీసం ఒక్కరినైనా పట్టుకున్నారా? బొత్స చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంద్రాలో ఎమ్మెల్యేలు ,ఏపీపీఎస్సీ మెంబర్లే వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారని అన్నారు. బొత్స సత్యనారాయణ వీటన్నింటిపై సాయంత్రం లోపు స్పందించాలని కోరారు. హైదరాబాదు మీద మళ్ళీ ఆంధ్ర నాయకుల కన్ను పడిందా ?!అని మండిపడ్డారు. విద్యావ్యవస్థపై నేను చెప్పిన లెక్కలకు స్పందించాకే బొత్స సత్యనారాయణ హైదరాబాద్ లో అడుగుపెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స వ్యాఖ్యలపై జగన్ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని, వెంటనే బర్తరఫ్ చేసి చూపించాలి డిమాండ్ చేశారు.
Manchu Mohan babu : మీడియాపై మోహన్బాబు ఫైర్.. లోగోలు లాక్కోమని?
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!