Vemula Prashanth Reddy: అసంపూర్తిగా తెలంగాణ సచివాలయ పనులు.. 10 రోజుల్లో పూర్తి చేయాలని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Reddy: తెలంగాణ సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్రెడ్డి అధికారులతో సమీక్షించారు. తెలంగాణ నూతన సచివాలయాన్ని వచ్చే నెల 17న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. అసంపూర్తిగా ఉన్న పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 10 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోవద్దని మంత్రి అధికారులకు సూచించారు. తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి సకల సౌకర్యాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో 2019 జూన్ 27న కొత్త సచివాలయ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయ నిర్మాణం చేపట్టారు.
Read also: Khammam Traffic Restrictions: కనివినీ ఎరుగని రీతిలో ఖమ్మం సభ.. ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
- ED Raids: హైదరాబాద్లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్గా మోసాలు.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
తొమ్మిది నెలల్లో ఈ సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. కానీ కరోనా కారణంగా సచివాలయ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. 2022 అక్టోబర్లో సచివాలయం ప్రారంభం కావాల్సి ఉండగా.. అక్టోబర్ నెల నాటికి సచివాలయ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో అక్టోబర్ నెలలో జరగాల్సిన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రస్తుతం సంక్రాంతికి మంచి రోజులు లేవు. సంక్రాంతి తర్వాత సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. ఫిబ్రవరిలో కేసీఆర్ పుట్టినరోజు. దీంతో ఫిబ్రవరి 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.కొత్త సచివాలయంలో మంత్రుల కార్యాలయాలతో పాటు ఆయా శాఖల అధికారుల కార్యాలయాలు కూడా ఉంటాయి. అంతేకాదు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరాలను కూడా నిర్మించారు. మరోవైపు మంత్రులు, సందర్శకులు, అధికారుల వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సచివాలయాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. సీఎం కేసీఆర్ కార్యాలయం ఏడో అంతస్తులో ఉంది.
తాజావార్తలు
-
DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
-
Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
-
Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
-
AK 47: చిట్టిబాబుకు జోడీగా శ్రీనిధి శెట్టి.. స్వర్ణ పాత్రలో ఆకట్టుకుంటున్న గ్లింప్స్
-
Mega DSC: ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!