ప్రాజెక్టుల పనులు ఆపితేనే ఏపీతో చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ మొదలైంది… అయితే, ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల జీవో ఉపసంహరించుకుని, పనులు అపి వస్తే చర్చలకు సిద్ధం అని ప్రకటించారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సమైక్య రాష్ట్రంలో ఆనాడు పాలకులే తెలంగాణ ప్రాంతానికి కరువు సృష్టించారని ఫైర్ అయ్యారు.. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల పై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పనుల గురించి మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల పై తెలంగాణ ప్రజలు ఉద్యమించే సమయం వస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
also read ఆనందయ్యకు మద్రాసు హైకోర్టు సెల్యూట్
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడు ఆంధ్ర నాయకులు ఆలోచించలేదన్నారు జగదీష్ రెడ్డి.. జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను వైఎస్సార్ దోపిడీ చేశారని ఆరోపించిన ఆయన.. ఇవాళ మాట్లాడుతున్న నాయకులందరూ వైఎస్సార్ వెంట ఉండి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. తెలంగాణను దోచుకునే విషయం వచ్చేసరికి ఆంధ్రా నేతలందరూ ఒక్కటి అవుతున్నారని.. వాళ్లను చూసి తెలంగాణ ప్రతిపక్షాలు నేర్చుకోవాలని హితవుపలికారు.. చట్టం- రాజ్యాంగం ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాల్సినవన్ని చేస్తుందన్న ఆయన.. జాతీయ పార్టీలు ఎప్పుడూ తెలంగాణ కోసం కొట్లాడలేదన్నారు.. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ ప్రాంతంలో ఇంకా ఆకలి చావులు కొనసాగుతుండేవన్నారు. ఇక, కేంద్రం పక్షపాత ధోరణి కనిపిస్తుందన్న జగదీష్ రెడ్డి.. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం, ఏపీ ఒక్కటే అన్నట్టు కనిపిస్తుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!