ఆపే శక్తి, హక్కు ఎవరికీ లేదు.. ఇవి పాతరోజులు కావు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం మరింత ముదురుతూనే ఉంది.. తాజాగా, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించగా.. ఏపీ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదన్న ఆయన.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు.. ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్న ఆయన.. తెలంగాణ ఏమి చేయాలో ఆంధ్ర నిర్ణయిస్తుందా…? అని ప్రశ్నించారు.. ఇక, ఇతర ప్రాంతాల ప్రజలు మా అతిథులు వ్యాఖ్యానించిన జగదీష్ రెడ్డి.. అక్కడి ప్రజల బాగోగులపైనే ఆంధ్ర సర్కార్ కు సోయిలేదని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డ జగదీష్ రెడ్డి.. మా ఇష్టమోచ్చినట్లు మేం చేస్తాం. మేం చెప్పినట్లు మీరు చేయాలి అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు.. ఏపీ పాలకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని.. కృష్ణా నీటిలో మా వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం అని స్పష్టం చేశారు. దొంగదారిలో, అక్రమ పద్ధతిలో నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని.. తప్పకుండా చేసుకుంటాం.. ఎవరో ఆర్డర్ ఇస్తే వినాల్సిన అవసరం మాకు లేదన్నారు. మూడో వ్యక్తి జోక్యం లేకుండా ఇద్దరం కూర్చోని మాట్లాడుకుందాం అని మొదట ప్రతిపాదించింది తెలంగాణ సీఎం కేసీఆరేనని గుర్తుచేసిన ఆయన.. కానీ, దానిని తీసుకోవడంలో పక్క రాష్ట్ర సీఎం విజ్ణత లోపించిందన్నారు.. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నంత సేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం.. అలా చేయకుండా తెలంగాణను ఆపే శక్తి ఎవరికి లేదు.. ఆపే హక్కు ఎవరికి లేదన్నారు. ఇవి పాతరోజులు కావు.. తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రం అన్న జగదీష్ రెడ్డి.. ఎవరి చెప్పుచేతుల్లో లేదు.. మీ బానిసలు అధికారంలో లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు మీ ప్రాంత వాసులు బానిసలుగా చేసుకొని ఆటలు సాగించారు. ఇప్పుడు సాగవని హెచ్చరించిన ఆయన.. ఇకనైనా మీ కుప్పిగంతలు ఆపండి..రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు విషయంలో ముందు మీ అక్రమ నిర్మాణాలు మానేసి ముందుకు రండి అని సూచించారు. ఇరు రాష్ట్రాల రైతంగానికి లబ్ధి చేకూరేలా తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ణతతో ఆలోచిస్తారని.. మీ జేబులో మేం దోచుకుంటాం.. మా జేబుల వైపు చూడవద్దు అంటే ఇక్కడెవరూ అమాయకులు లేరని.. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి చూసుకుంటున్నారు కేసీఆర్ అని తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.
Also Read
- Bhatti Vikramarka : SIRను అడ్డంపెట్టుకుని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోంది
- KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
- Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
- sonam wangchuk: "మాకు మంత్రి పదవులపై ఆశ లేదు".. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : SIRను అడ్డంపెట్టుకుని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోంది
-
Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
-
SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్పై సంచలన రిపోర్ట్..
-
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
-
VIJAY : తమిళనాడు సీఎం విజయ్ – భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు
ట్రెండింగ్
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!