ఆపే శక్తి, హక్కు ఎవరికీ లేదు.. ఇవి పాతరోజులు కావు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం మరింత ముదురుతూనే ఉంది.. తాజాగా, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించగా.. ఏపీ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదన్న ఆయన.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు.. ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్న ఆయన.. తెలంగాణ ఏమి చేయాలో ఆంధ్ర నిర్ణయిస్తుందా…? అని ప్రశ్నించారు.. ఇక, ఇతర ప్రాంతాల ప్రజలు మా అతిథులు వ్యాఖ్యానించిన జగదీష్ రెడ్డి.. అక్కడి ప్రజల బాగోగులపైనే ఆంధ్ర సర్కార్ కు సోయిలేదని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డ జగదీష్ రెడ్డి.. మా ఇష్టమోచ్చినట్లు మేం చేస్తాం. మేం చెప్పినట్లు మీరు చేయాలి అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు.. ఏపీ పాలకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని.. కృష్ణా నీటిలో మా వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం అని స్పష్టం చేశారు. దొంగదారిలో, అక్రమ పద్ధతిలో నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని.. తప్పకుండా చేసుకుంటాం.. ఎవరో ఆర్డర్ ఇస్తే వినాల్సిన అవసరం మాకు లేదన్నారు. మూడో వ్యక్తి జోక్యం లేకుండా ఇద్దరం కూర్చోని మాట్లాడుకుందాం అని మొదట ప్రతిపాదించింది తెలంగాణ సీఎం కేసీఆరేనని గుర్తుచేసిన ఆయన.. కానీ, దానిని తీసుకోవడంలో పక్క రాష్ట్ర సీఎం విజ్ణత లోపించిందన్నారు.. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నంత సేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం.. అలా చేయకుండా తెలంగాణను ఆపే శక్తి ఎవరికి లేదు.. ఆపే హక్కు ఎవరికి లేదన్నారు. ఇవి పాతరోజులు కావు.. తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రం అన్న జగదీష్ రెడ్డి.. ఎవరి చెప్పుచేతుల్లో లేదు.. మీ బానిసలు అధికారంలో లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు మీ ప్రాంత వాసులు బానిసలుగా చేసుకొని ఆటలు సాగించారు. ఇప్పుడు సాగవని హెచ్చరించిన ఆయన.. ఇకనైనా మీ కుప్పిగంతలు ఆపండి..రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు విషయంలో ముందు మీ అక్రమ నిర్మాణాలు మానేసి ముందుకు రండి అని సూచించారు. ఇరు రాష్ట్రాల రైతంగానికి లబ్ధి చేకూరేలా తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ణతతో ఆలోచిస్తారని.. మీ జేబులో మేం దోచుకుంటాం.. మా జేబుల వైపు చూడవద్దు అంటే ఇక్కడెవరూ అమాయకులు లేరని.. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి చూసుకుంటున్నారు కేసీఆర్ అని తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.
Also Read
- Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
- Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
తాజావార్తలు
-
Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్చాట్ వైరల్
-
Abrar Ahmed: కావ్య మారన్కు బిగ్ షాక్.. చిక్కుల్లో పాక్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. రూ. 2.3 కోట్లు స్వాహా!
-
Deepa Thomas: స్టేజ్ మీదే ఏడ్చేసిన ‘రావు బహదూర్’ హీరోయిన్..
-
Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
-
CM Chandrababu Naidu: ‘సీమలో సీన్ మారింది’.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..