ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి షెకావత్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. వారు బీజేపీ అయినా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అనే మాట, గుర్తుంచుకోవాలని.. రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు… పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు.. రానున్న రోజుల్లో హైదరాబాద్ నాలుగు మూలల నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు రానున్నాయని తెలిపారు మంత్రి హరీష్రావు.. ఇక, దేశంలో రైతులకు నీళ్లు ఇచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి సాగుబడికి డబ్బు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఈ సందర్భంగా గుర్తుచేశారు.