Telangana Govt: కొత్తగా 466 అంబులెన్స్లు.. ఆగస్టు 1న ప్రారంభం
Telangana Govt: తెలంగాణలో కొత్త అంబులెన్స్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం 466 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాహనాలను ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.వీటి స్థానంలో పాత వాహనాలు, కాలం చెల్లిన అంబులెన్స్లను ప్రవేశపెడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కొత్త వాహనాలను సిద్ధం చేసింది. ఇందులో 108 అంబులెన్స్లు 204.. 228 అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టి గర్భిణులను దవాఖానకు తీసుకొచ్చి సురక్షితంగా ఇంటి వద్ద వదిలిపెట్టనున్నారు. అలాగే మరో 34 గ్రౌండ్ వెహికల్స్ తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 466 వాహనాలు ప్రజలకు సేవలు అందించనున్నాయి. పాతవి నాసిరకంగా ఉండడంతో అప్పుడప్పుడు రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి. అలాగే వాటి మరమ్మతులకు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే వాటి నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువ. దీంతో వాటి స్థానంలో ఇటీవల వైద్యారోగ్యశాఖ కొత్త వాహనాలను కొనుగోలు చేసింది.
Read also: Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
Also Read
- Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ఇటీవల అంబులెన్స్ సేవలకు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంబులెన్స్ల పనితీరుపై చర్చించారు. కాలం చెల్లిన అంబులెన్స్లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అధికారుల నివేదిక తర్వాత ప్రభుత్వం కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసింది. ఇవి అత్యవసర సమయాల్లో అత్యవసర సేవలను అందించడంతో పాటు ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తాయని ప్రభుత్వం చెబుతోంది. బాధితులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్యం అందించడానికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 426 అంబులెన్స్లు 108 సేవలను అందిస్తున్నాయి. వాటిలో 175 వాహనాలను తొలగించనున్నారు. 204 కొత్త అంబులెన్స్లతో కలిపి 108 అంబులెన్స్ల సంఖ్య 455కి చేరుకోగా.. గర్భిణుల కోసం ప్రత్యేక సేవలు అందించే వాహనాలు 102 ఉండగా.. 300 ఉండగా.. వాటిలో ల్యాప్ అయిన 228 వాహనాలను తొలగిస్తారు. ఇప్పుడు కొత్తగా 228 వాహనాలను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో మృతుల మృతదేహాలను తరలించేందుకు 50 శవవాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 34 వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు.
Telangana Rians: రాబోయే వారం రోజులు వానల్లేవు.. ఆగస్టు రెండో వారం నుంచి మళ్లీ స్టార్ట్
తాజావార్తలు
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో