Telangana Govt: కొత్తగా 466 అంబులెన్స్లు.. ఆగస్టు 1న ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: తెలంగాణలో కొత్త అంబులెన్స్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం 466 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాహనాలను ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.వీటి స్థానంలో పాత వాహనాలు, కాలం చెల్లిన అంబులెన్స్లను ప్రవేశపెడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కొత్త వాహనాలను సిద్ధం చేసింది. ఇందులో 108 అంబులెన్స్లు 204.. 228 అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టి గర్భిణులను దవాఖానకు తీసుకొచ్చి సురక్షితంగా ఇంటి వద్ద వదిలిపెట్టనున్నారు. అలాగే మరో 34 గ్రౌండ్ వెహికల్స్ తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 466 వాహనాలు ప్రజలకు సేవలు అందించనున్నాయి. పాతవి నాసిరకంగా ఉండడంతో అప్పుడప్పుడు రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి. అలాగే వాటి మరమ్మతులకు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే వాటి నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువ. దీంతో వాటి స్థానంలో ఇటీవల వైద్యారోగ్యశాఖ కొత్త వాహనాలను కొనుగోలు చేసింది.
Read also: Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
ఇటీవల అంబులెన్స్ సేవలకు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంబులెన్స్ల పనితీరుపై చర్చించారు. కాలం చెల్లిన అంబులెన్స్లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అధికారుల నివేదిక తర్వాత ప్రభుత్వం కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసింది. ఇవి అత్యవసర సమయాల్లో అత్యవసర సేవలను అందించడంతో పాటు ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తాయని ప్రభుత్వం చెబుతోంది. బాధితులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్యం అందించడానికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 426 అంబులెన్స్లు 108 సేవలను అందిస్తున్నాయి. వాటిలో 175 వాహనాలను తొలగించనున్నారు. 204 కొత్త అంబులెన్స్లతో కలిపి 108 అంబులెన్స్ల సంఖ్య 455కి చేరుకోగా.. గర్భిణుల కోసం ప్రత్యేక సేవలు అందించే వాహనాలు 102 ఉండగా.. 300 ఉండగా.. వాటిలో ల్యాప్ అయిన 228 వాహనాలను తొలగిస్తారు. ఇప్పుడు కొత్తగా 228 వాహనాలను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో మృతుల మృతదేహాలను తరలించేందుకు 50 శవవాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 34 వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు.
Telangana Rians: రాబోయే వారం రోజులు వానల్లేవు.. ఆగస్టు రెండో వారం నుంచి మళ్లీ స్టార్ట్
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!