Telangana Govt: కొత్తగా 466 అంబులెన్స్లు.. ఆగస్టు 1న ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: తెలంగాణలో కొత్త అంబులెన్స్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం 466 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాహనాలను ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.వీటి స్థానంలో పాత వాహనాలు, కాలం చెల్లిన అంబులెన్స్లను ప్రవేశపెడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కొత్త వాహనాలను సిద్ధం చేసింది. ఇందులో 108 అంబులెన్స్లు 204.. 228 అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టి గర్భిణులను దవాఖానకు తీసుకొచ్చి సురక్షితంగా ఇంటి వద్ద వదిలిపెట్టనున్నారు. అలాగే మరో 34 గ్రౌండ్ వెహికల్స్ తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 466 వాహనాలు ప్రజలకు సేవలు అందించనున్నాయి. పాతవి నాసిరకంగా ఉండడంతో అప్పుడప్పుడు రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి. అలాగే వాటి మరమ్మతులకు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే వాటి నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువ. దీంతో వాటి స్థానంలో ఇటీవల వైద్యారోగ్యశాఖ కొత్త వాహనాలను కొనుగోలు చేసింది.
Read also: Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
ఇటీవల అంబులెన్స్ సేవలకు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంబులెన్స్ల పనితీరుపై చర్చించారు. కాలం చెల్లిన అంబులెన్స్లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అధికారుల నివేదిక తర్వాత ప్రభుత్వం కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసింది. ఇవి అత్యవసర సమయాల్లో అత్యవసర సేవలను అందించడంతో పాటు ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తాయని ప్రభుత్వం చెబుతోంది. బాధితులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్యం అందించడానికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 426 అంబులెన్స్లు 108 సేవలను అందిస్తున్నాయి. వాటిలో 175 వాహనాలను తొలగించనున్నారు. 204 కొత్త అంబులెన్స్లతో కలిపి 108 అంబులెన్స్ల సంఖ్య 455కి చేరుకోగా.. గర్భిణుల కోసం ప్రత్యేక సేవలు అందించే వాహనాలు 102 ఉండగా.. 300 ఉండగా.. వాటిలో ల్యాప్ అయిన 228 వాహనాలను తొలగిస్తారు. ఇప్పుడు కొత్తగా 228 వాహనాలను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో మృతుల మృతదేహాలను తరలించేందుకు 50 శవవాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 34 వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు.
Telangana Rians: రాబోయే వారం రోజులు వానల్లేవు.. ఆగస్టు రెండో వారం నుంచి మళ్లీ స్టార్ట్
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!