Telangana Govt: కొత్తగా 466 అంబులెన్స్లు.. ఆగస్టు 1న ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: తెలంగాణలో కొత్త అంబులెన్స్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం 466 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాహనాలను ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.వీటి స్థానంలో పాత వాహనాలు, కాలం చెల్లిన అంబులెన్స్లను ప్రవేశపెడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కొత్త వాహనాలను సిద్ధం చేసింది. ఇందులో 108 అంబులెన్స్లు 204.. 228 అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టి గర్భిణులను దవాఖానకు తీసుకొచ్చి సురక్షితంగా ఇంటి వద్ద వదిలిపెట్టనున్నారు. అలాగే మరో 34 గ్రౌండ్ వెహికల్స్ తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 466 వాహనాలు ప్రజలకు సేవలు అందించనున్నాయి. పాతవి నాసిరకంగా ఉండడంతో అప్పుడప్పుడు రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి. అలాగే వాటి మరమ్మతులకు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే వాటి నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువ. దీంతో వాటి స్థానంలో ఇటీవల వైద్యారోగ్యశాఖ కొత్త వాహనాలను కొనుగోలు చేసింది.
Read also: Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
ఇటీవల అంబులెన్స్ సేవలకు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంబులెన్స్ల పనితీరుపై చర్చించారు. కాలం చెల్లిన అంబులెన్స్లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అధికారుల నివేదిక తర్వాత ప్రభుత్వం కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసింది. ఇవి అత్యవసర సమయాల్లో అత్యవసర సేవలను అందించడంతో పాటు ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తాయని ప్రభుత్వం చెబుతోంది. బాధితులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్యం అందించడానికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 426 అంబులెన్స్లు 108 సేవలను అందిస్తున్నాయి. వాటిలో 175 వాహనాలను తొలగించనున్నారు. 204 కొత్త అంబులెన్స్లతో కలిపి 108 అంబులెన్స్ల సంఖ్య 455కి చేరుకోగా.. గర్భిణుల కోసం ప్రత్యేక సేవలు అందించే వాహనాలు 102 ఉండగా.. 300 ఉండగా.. వాటిలో ల్యాప్ అయిన 228 వాహనాలను తొలగిస్తారు. ఇప్పుడు కొత్తగా 228 వాహనాలను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో మృతుల మృతదేహాలను తరలించేందుకు 50 శవవాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 34 వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు.
Telangana Rians: రాబోయే వారం రోజులు వానల్లేవు.. ఆగస్టు రెండో వారం నుంచి మళ్లీ స్టార్ట్
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..