Digvijay Singh: చేతులు జోడించి విజ్ఞప్తి.. కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digvijay Singh: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు, ఇన్ఛార్జ్ల మార్పు తన పరిధిలోకి రాదన్నారు. టీకాంగ్రెస్పై త్వరలోనే స్పష్టత వస్తుందని దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి పార్టీ పంథాకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర నేతలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారని, అందరూ కలిసి పని చేయాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు.
Read also: Venkaiah Naidu: మనిషికి శ్వాస ఎంతో భాష కూడా అంతే అవసరం..
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
‘సమిష్టిగా పని చేస్తేనే ప్రత్యర్థులను ఓడించగలం. పార్టీ నేతలందరికీ ముకుళిత హస్తాలతో చెబుదాం. ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి. పార్టీలో విభేదాల గురించి ఏ నాయకుడూ బహిరంగంగా మాట్లాడకూడదు. బీఆర్ఎస్పై పోరాటానికి కాంగ్రెస్ నేతలంతా సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పార్టీ సీరియస్తో కాకుండా పనితీరుతో ముందుకు సాగుతుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 34 ఏళ్లు, నేను 38 ఏళ్లు పీసీసీ చీఫ్లుగా పనిచేశాను.సీఎంలతో కలిసి పనిచేసి విజయం సాధించాం. టీ కాంగ్రెస్లో సీనియర్లు, జూనియర్ల ప్రస్తావన లేదు. అందరూ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంకండి’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
Read also: Cirkus: బాలీవుడ్ ఖాతాలో మరో భారి ఫ్లాప్?
అందరూ పార్టీ నిబంధనల మేరకే పని చేయాలని తెలిపారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడండి.. బహిరంగ ఆరోపణలు వద్దన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న మరో మారు ఇలాంటివి పునరావృతం కావొద్దని, అలా జరిగితే ఎంత పెద్ద నాయకుడి పైన చర్యలు తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. అన్ని సెటిల్ అవుతాయని, కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉంటేనే బీఆర్ఎస్.. బీజేపీని ఎదుర్కోగలమన్నారు. రేవంత్ నన్ను మొన్ననే కలిశారని, అన్ని సెటిల్ అవుతాయని,
నో ప్రాబ్లమ్ అన్నారు దిగ్విజయ్ సింగ్. సీనియారిటీ కాదు పనితీరు తోటే పార్టీ ముందుకు పోతుందని గుర్తుచేశారు.
Cirkus: బాలీవుడ్ ఖాతాలో మరో భారి ఫ్లాప్?
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!