Digvijay Singh: చేతులు జోడించి విజ్ఞప్తి.. కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digvijay Singh: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు, ఇన్ఛార్జ్ల మార్పు తన పరిధిలోకి రాదన్నారు. టీకాంగ్రెస్పై త్వరలోనే స్పష్టత వస్తుందని దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి పార్టీ పంథాకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర నేతలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారని, అందరూ కలిసి పని చేయాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు.
Read also: Venkaiah Naidu: మనిషికి శ్వాస ఎంతో భాష కూడా అంతే అవసరం..
Also Read
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
‘సమిష్టిగా పని చేస్తేనే ప్రత్యర్థులను ఓడించగలం. పార్టీ నేతలందరికీ ముకుళిత హస్తాలతో చెబుదాం. ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి. పార్టీలో విభేదాల గురించి ఏ నాయకుడూ బహిరంగంగా మాట్లాడకూడదు. బీఆర్ఎస్పై పోరాటానికి కాంగ్రెస్ నేతలంతా సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పార్టీ సీరియస్తో కాకుండా పనితీరుతో ముందుకు సాగుతుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 34 ఏళ్లు, నేను 38 ఏళ్లు పీసీసీ చీఫ్లుగా పనిచేశాను.సీఎంలతో కలిసి పనిచేసి విజయం సాధించాం. టీ కాంగ్రెస్లో సీనియర్లు, జూనియర్ల ప్రస్తావన లేదు. అందరూ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంకండి’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
Read also: Cirkus: బాలీవుడ్ ఖాతాలో మరో భారి ఫ్లాప్?
అందరూ పార్టీ నిబంధనల మేరకే పని చేయాలని తెలిపారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడండి.. బహిరంగ ఆరోపణలు వద్దన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న మరో మారు ఇలాంటివి పునరావృతం కావొద్దని, అలా జరిగితే ఎంత పెద్ద నాయకుడి పైన చర్యలు తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. అన్ని సెటిల్ అవుతాయని, కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉంటేనే బీఆర్ఎస్.. బీజేపీని ఎదుర్కోగలమన్నారు. రేవంత్ నన్ను మొన్ననే కలిశారని, అన్ని సెటిల్ అవుతాయని,
నో ప్రాబ్లమ్ అన్నారు దిగ్విజయ్ సింగ్. సీనియారిటీ కాదు పనితీరు తోటే పార్టీ ముందుకు పోతుందని గుర్తుచేశారు.
Cirkus: బాలీవుడ్ ఖాతాలో మరో భారి ఫ్లాప్?
తాజావార్తలు
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!