Congress Dinner Meet: టి.కాంగ్రెస్ డిన్నర్ మీట్.. ఒక్కచోట చేరిన సీనియర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన అంశాలను తెర మీదకు తెచ్చారు రేవంత్ రెడ్డి… తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్రానికి కొత్తగా జెండా ఏర్పాటు అంశాలపై కార్యాచరణ రూపొందించారు. దీనిపై జానారెడ్డి నివాసంలో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్, దామోదర రాజనర్సింహ.. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి.. మధు యాష్కీ మీటింగ్కు హాజరయ్యారు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల భేటీలో సెప్టెంబర్ 17, కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చర్చించారు. ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లిని ఏ పార్టీ పాటించడం లేదన్నారు జానారెడ్డి. కొత్త విగ్రహం కంటే.. భరత మాత తరహా విగ్రహం రూపొందించడం బెటర్ అని సూచించారు జానారెడ్డి. మరోవైపు రాష్ట్ర జెండా విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. కర్ణాటకలో ఏం జరిగిందనే దానిపై అధ్యయనం చేయాలని కోరారు. అటు ‘జయ జయహే తెలంగాణ’ అని అందే శ్రీ పాట కి సీనియర్స్ ఆమోదం పలికారు. కొత్త తెలంగాణ విగ్రహం ఏర్పాటుపై తొందర వద్దన్న నేతలు.. జనంలో చర్చ పెట్టి.. మార్పులు చేర్పులు చేద్దామన్నట్టు సమాచారం.
Read Also: AP Assembly Session Live Updates: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్..
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
మరోవైపు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంట్లో డిన్నర్ మీట్కు హాజరయ్యారు సీనియర్ నేతలు. కొత్తగా రాష్ట్రానికి ఏఐసీసీ కార్యదర్శులుగా ఎన్నికైన నదీం జావేద్, రోహిత్ చౌదరిలకు విందు ఇచ్చే క్రమంలో పార్టీ సీనియర్లను కూడా ఆహ్వానించారు. సీఎల్పీనేత భట్టి, ఉత్తమ్ పాటుగా సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్, షబ్బీర్ అలీ విందుకు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పొన్నం ప్రభాకర్ , మధుయాష్కీ లాంటి నేతలు కూడా ఈ సమావేశానికి వచ్చారు. పార్టీలో నాయకుల మధ్య ఐక్యతకు సంబందించి అంశాలపై చర్చించారు. నాయకులంతా ఏకధాటిపై ఉన్నారనే ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు మహేశ్వర రెడ్డి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో రెండు కీలక సమావేశాలు జరిగాయి. ఒకటి సెప్టెంబర్ 17 పై కాగా.. మరొకటి పార్టీలో నాయకుల మధ్య ఐక్యత కు సంబందించిన అంశం.
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..