Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో ట్విస్ట్..
- మైనర్ బాలికపై ఫిర్యాదు వెనక్కి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar Protest: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన నిర్వహించారు. ఈ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోడీని అత్యంత దారుణంగా తిట్టిన మైనర్ బాలికపై కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలికపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారు స్మృతి సింగ్ తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ వీడియోలో పిల్లల్ని క్షమిస్తున్నట్లు ప్రకటించడం, మైనర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఈ పరిణామాలకు ముందు ఘజియాబాద్ నివాసి స్మృతి సింగ్, నోయిడా ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో ఒక మైనర్పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగినందున, దీనిని జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. నిరసన ప్రదర్శన సమయంలో ప్రధానితో పాటు ఆయన తల్లిపై అభ్యంతరకరమైన మాటలు వాడారని స్మృతి సింగ్ చెప్పారు. దీంతోనే తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రధాని పిల్లల్ని క్షమించడంతో, మైనర్తో పాటు ఆమె తల్లి పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో తాను కంప్లైంట్ వాపస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న మైనర్ బాలిక జూలై 23న, ప్రధానిని ఉద్దేశిస్తూ చట్టానికి, సామాజిక మర్యాదకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత తన తప్పును గ్రహించి కన్నీటితో క్షమాపణలు చెప్పింది. ప్రధాని మోడీ కూడా పిల్లలు తప్పులు చేస్తారని, వారు తమ తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు తనపై అనుచిత వ్యా్ఖ్యలు చేసిన వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు. మైనర్ బాలిక తల్లి ఇది తన బిడ్డకు మోడీ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ పరిణామాల తర్వాత ఫిర్యాదుదారు కూడా తన కేసును వాపస్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?