TRS: కేంద్రంపై ఒత్తిడి.. ఢిల్లీలో.. గల్లీలోనూ పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ సర్కార్పై రెండు వైపుల నుంచి ఒత్తిడి చేస్తోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ… ఓవైపు ధాన్యం, బియ్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి.. ఒత్తిడి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు.. గల్లీలోనూ బీజేపీపై పోరు సాగిస్తోంది.. గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ఇక, ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం.. ఇప్పటికే గోయల్ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీ కేకే.. నలుగురు మంత్రులు ఢిల్లీ వచ్చారని గోయల్కు వివరించారు. మంత్రులకు, ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వాలని గోయల్ను కేశవరావు కోరారు. రేపు షెడ్యూల్ చూసుకుని సమయం ఇచ్చేందుకు పరిశీలిస్తానని పీయూష్ గోయల్ కేకేకు తెలిపారు… ఈ తర్వాత ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు.. అయితే, వన్ నేషన్–వన్ ప్రొక్యూర్మెంట్ నినాదంతో, పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర మంత్రుల బృందం హస్తినకు వెళ్లిన విషయం తెలిసిందే.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన ఈ బృందంలో నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. మొత్తంగా.. ఢిల్లీతో పాటు గల్లీలోనూ బీజేపీపై పోరు చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ.
తాజావార్తలు
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!