ప్రధాని కోసం మృత్యుంజయ హోమాలు.. బీజేపీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన పెద్ద రచ్చగా మారింది.. రైతుల ఆందోళనతో మార్గమధ్యలో ఇరుక్కుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు.. ఈ ఘటనలో పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి.. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని భద్రత పట్ట నిర్లక్ష్యంగా వ్యవహరించారని పంజాబ్లోని కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తోంది బీజేపీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంజాబ్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేస్తుండగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది..
Read Also: కరోనా ఎఫెక్ట్.. సంపూర్ణ లాక్డౌన్..
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు.. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని మృత్యుంజయ హోమం నిర్వహించేందుకు సిద్ధమైంది.. మండల, జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు.. బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్.. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో బండి సంజయ్ పాల్గొననున్నారు.. మరోవైపు, పంజాబ్ ఘటనను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!