IND Vs AUS: డిసైడర్ కోసం హైదరాబాద్ చేరుకున్న భారత్-ఆస్ట్రేలియా జట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs AUS: ఆదివారం నాడు హైదరాబాద్లో కీలక మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా చివరి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. అయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్ చేరుకున్న అనంతరం టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్ల సభ్యులు ప్రత్యేక బస్సులో హోటల్ తాజ్కృష్ణాకు వెళ్లారు. ముందు సీటులో హార్దిక్ పాండ్యా కూర్చోవడంతో అభిమానులు అతడిని చూసి హంగామా చేశారు. ఈ రోజు రాత్రికి తాజ్కృష్ణాలోనే ఆటగాళ్లు బస చేయనున్నారు.
Read Also:Team India: ఉప్పల్లో గెలిస్తే చరిత్ర సృష్టించనున్న టీమిండియా
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
కాగా రేపు జరిగే టీ20లో ఎవరు గెలిస్తే వాళ్లే సిరీస్ కైవసం చేసుకుంటారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటు ఈ మ్యాచ్కు వచ్చే అభిమానులు కెమెరాలు, సెల్ఫీ స్టిక్లు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, మారణాయుధాలు, పదునైన వస్తువులు, ఆల్కహాల్, తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, హెల్మెట్లు తీసుకురావొద్దని.. వాటిని స్టేడియంలోకి అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం సాయంత్రం 4 గంటల నుంచి స్టేడియంలోకి అభిమానులను అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. టిక్కెట్లు ఉన్న ప్రేక్షకులు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..