Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేషన్ ఘనపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత వారం రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతూ కడియం శ్రీహరి అబద్ధాలు మాట్లాడుతూ ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలన్నీ చిన్నపిల్లల చిలిపి చేష్టలు, కారుకూతల్లాగే ఉన్నాయని మండిపడ్డారు.
కాళేశ్వరం అద్భుతం.. రేవంత్ రెడ్డిది ఆంధ్రకు నీటి దోపిడీ కుట్ర
ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతం, వరప్రదాయని, మానస పుత్రిక అని పొగిడిన కడియం శ్రీహరి, నేడు మాటమార్చి కాళేశ్వరం కాదని కుళేశ్వరం అనడం ఆయన నైజానికి నిదర్శనమని రాజయ్య విమర్శించారు. దేవాదులకు కడియం సృష్టికర్త కాదని, వినాశక కర్త అని ధ్వజమెత్తారు. తెలంగాణను ఎండబెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిని దోచిపెట్టేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, 16 రిజర్వాయర్లకు నీరందించే కల్పతరువు అని స్పష్టం చేశారు. కేసీఆర్కు చెడ్డపేరు తేవడానికే కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, ఇప్పుడు NDSAకి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
Also Read
- Ponnam Prabhakar: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత పోరాట విజయం
- NIMS Hyderabad : నిమ్స్లో వైద్య రంగానికి మైలురాయి.. 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు
- CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
- CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
రాష్ట్రంలో రేవంత్ కరువు.. ఘనపూర్లో కడియం కరువు
రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపైనా, రైతుల సమస్యలపైనా కనీస అవగాహన లేదని రాజయ్య దుయ్యబట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన వల్ల కరువు వస్తే, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వల్ల కరువు వచ్చిందని వ్యాఖ్యానించారు. నకిలీ కాంగ్రెస్లోకి వెళ్లిన కడియం శ్రీహరి, ఎమ్మెల్యేగా ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కడియం కేవలం కమిషన్లు వచ్చే పనులపైనే దృష్టి పెడతారని, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టుల అంచనాలు పెంచిన చరిత్ర ఆయనదని తీవ్ర ఆరోపణలు చేశారు.
చర్చకు సిద్ధమా? అంబేద్కర్ విగ్రహం వద్దకు రా అని సవాల్
నియోజకవర్గానికి ఎవరు ఎంత చేశారనే దానిపై బహిరంగ చర్చకు రావలసిందిగా కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. “నేను చేసిన అభివృద్ధి పనులపై, నువ్వు చేసిన పనులపై చర్చకు సిద్ధం.. స్టేషన్ ఘనపూర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలి” అని సవాల్ చేశారు. అలాగే అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకు పదవులు రాకుండా కడియం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. “ఎక్కువ మాట్లాడకుండా కుక్కిన పేనులాగా ఉండు బిడ్డా” అంటూ కడియం శ్రీహరికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు
-
Delhi: ఢిల్లీ వాసులకు శుభవార్త.. తెరుచుకున్న మెట్రో స్టేషన్లు
-
Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..
-
Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
-
Devendra Fadnacis: కేంద్రమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..? ఢిల్లీ నుంచి పిలుపు..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!