Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు
- కడియం శ్రీహరి అబద్ధాలు చెబుతున్నారని రాజయ్య విమర్శలు
- కాళేశ్వరం, రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
- ఘనపూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్
- కాంగ్రెస్, కమిషన్ల రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేషన్ ఘనపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత వారం రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతూ కడియం శ్రీహరి అబద్ధాలు మాట్లాడుతూ ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలన్నీ చిన్నపిల్లల చిలిపి చేష్టలు, కారుకూతల్లాగే ఉన్నాయని మండిపడ్డారు.
కాళేశ్వరం అద్భుతం.. రేవంత్ రెడ్డిది ఆంధ్రకు నీటి దోపిడీ కుట్ర
ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతం, వరప్రదాయని, మానస పుత్రిక అని పొగిడిన కడియం శ్రీహరి, నేడు మాటమార్చి కాళేశ్వరం కాదని కుళేశ్వరం అనడం ఆయన నైజానికి నిదర్శనమని రాజయ్య విమర్శించారు. దేవాదులకు కడియం సృష్టికర్త కాదని, వినాశక కర్త అని ధ్వజమెత్తారు. తెలంగాణను ఎండబెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిని దోచిపెట్టేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, 16 రిజర్వాయర్లకు నీరందించే కల్పతరువు అని స్పష్టం చేశారు. కేసీఆర్కు చెడ్డపేరు తేవడానికే కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, ఇప్పుడు NDSAకి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
Also Read
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
- Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
- Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
రాష్ట్రంలో రేవంత్ కరువు.. ఘనపూర్లో కడియం కరువు
రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపైనా, రైతుల సమస్యలపైనా కనీస అవగాహన లేదని రాజయ్య దుయ్యబట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన వల్ల కరువు వస్తే, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వల్ల కరువు వచ్చిందని వ్యాఖ్యానించారు. నకిలీ కాంగ్రెస్లోకి వెళ్లిన కడియం శ్రీహరి, ఎమ్మెల్యేగా ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కడియం కేవలం కమిషన్లు వచ్చే పనులపైనే దృష్టి పెడతారని, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టుల అంచనాలు పెంచిన చరిత్ర ఆయనదని తీవ్ర ఆరోపణలు చేశారు.
చర్చకు సిద్ధమా? అంబేద్కర్ విగ్రహం వద్దకు రా అని సవాల్
నియోజకవర్గానికి ఎవరు ఎంత చేశారనే దానిపై బహిరంగ చర్చకు రావలసిందిగా కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. “నేను చేసిన అభివృద్ధి పనులపై, నువ్వు చేసిన పనులపై చర్చకు సిద్ధం.. స్టేషన్ ఘనపూర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలి” అని సవాల్ చేశారు. అలాగే అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకు పదవులు రాకుండా కడియం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. “ఎక్కువ మాట్లాడకుండా కుక్కిన పేనులాగా ఉండు బిడ్డా” అంటూ కడియం శ్రీహరికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!