Talasani Srinivas Yadav : పీయూష్ గోయల్ అసలు మంత్రేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Animal Husbandary, Fisheries and Cinematography Minister Talasani Srinivas Yadav Fired on Telangana BJP Leaders.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. నిన్న తెలంగాణ మంత్రులు యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులకు అనుగుణంగానే ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని పీయూష్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్.. ఎఫ్సీఐ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. పీయూష్ గోయల్ అసలు మంత్రేనా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్కు బాధ్యత ఉందా? తెలంగాణలో పండేది బాయిల్డ్ రైస్. రా రైస్ కొంచెం ఉత్పత్తి అవుతది. దేశంలో ఆకలి తీర్చే పరిస్థితులు కేంద్రానికి ఉండాలి. తెలంగాణ బీజేపీ కొంటవ, చస్తావా అంటుంది అని ఆయన మండిపడ్డారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
దేశంలో బీజేపీలు రెండు ఉన్నాయా? అసలు బీజేపీ నేతలకు మెదడు ఉందా? కేంద్రంలో అధికారంలో ఇచ్చింది ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటానికా? అని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి కూడా అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, దేశంలో పరిపాలన నడుస్తుందా? సికింద్రాబాద్ పార్లమెంట్ కు ఒక్క రూపాయి అయిన తెచ్చినవా కిషన్ రెడ్డి? అని ఆయన ప్రశ్నించారు. ఒకట్రెండు ఉప ఎన్నికల్లో గెలువంగానే అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోరని, టైమ్, అవకాశం వస్తే కేంద్రంలో ఏదైనా జరుగుతుందని ఆయన అన్నారు. మీ నాయకులు నూకలు తింటారా, వాళ్ళు తింటామని ప్రజలకు చెప్పించండన్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ నూకలు తింటారా? మీ ముఖానికి దేశంలో ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని ఆయన అన్నారు. జీఎస్టీ, డీ మానిటైజేషన్ తెచ్చి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేశారని, ధాన్యం కొనుగోలు రాజ్యాంగ పరమైన హక్కు.. మేమేమైన అడుక్కు తినే వాళ్ళమా? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొట్టగొట్టే కార్యక్రమాలు బీజేపీ నాయకులు చేయొద్దని, దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి నూకలు తినిపించాలి. ఆ తర్వాత మిగతా వారికి చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ఇప్పటికి వందసార్లు పెంచారని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!