Talasani Srinivas Yadav : పీయూష్ గోయల్ అసలు మంత్రేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Animal Husbandary, Fisheries and Cinematography Minister Talasani Srinivas Yadav Fired on Telangana BJP Leaders.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. నిన్న తెలంగాణ మంత్రులు యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులకు అనుగుణంగానే ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని పీయూష్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్.. ఎఫ్సీఐ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. పీయూష్ గోయల్ అసలు మంత్రేనా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్కు బాధ్యత ఉందా? తెలంగాణలో పండేది బాయిల్డ్ రైస్. రా రైస్ కొంచెం ఉత్పత్తి అవుతది. దేశంలో ఆకలి తీర్చే పరిస్థితులు కేంద్రానికి ఉండాలి. తెలంగాణ బీజేపీ కొంటవ, చస్తావా అంటుంది అని ఆయన మండిపడ్డారు.
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
దేశంలో బీజేపీలు రెండు ఉన్నాయా? అసలు బీజేపీ నేతలకు మెదడు ఉందా? కేంద్రంలో అధికారంలో ఇచ్చింది ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటానికా? అని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి కూడా అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, దేశంలో పరిపాలన నడుస్తుందా? సికింద్రాబాద్ పార్లమెంట్ కు ఒక్క రూపాయి అయిన తెచ్చినవా కిషన్ రెడ్డి? అని ఆయన ప్రశ్నించారు. ఒకట్రెండు ఉప ఎన్నికల్లో గెలువంగానే అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోరని, టైమ్, అవకాశం వస్తే కేంద్రంలో ఏదైనా జరుగుతుందని ఆయన అన్నారు. మీ నాయకులు నూకలు తింటారా, వాళ్ళు తింటామని ప్రజలకు చెప్పించండన్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ నూకలు తింటారా? మీ ముఖానికి దేశంలో ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని ఆయన అన్నారు. జీఎస్టీ, డీ మానిటైజేషన్ తెచ్చి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేశారని, ధాన్యం కొనుగోలు రాజ్యాంగ పరమైన హక్కు.. మేమేమైన అడుక్కు తినే వాళ్ళమా? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొట్టగొట్టే కార్యక్రమాలు బీజేపీ నాయకులు చేయొద్దని, దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి నూకలు తినిపించాలి. ఆ తర్వాత మిగతా వారికి చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ఇప్పటికి వందసార్లు పెంచారని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!