Swine Flu in Telangana: తెలంగాణపై స్వైన్ ఫ్లూ పంజా విసరబోతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీజనల్ వ్యాధుల తరహాలోనే స్వైన్ ఫ్లూ కేసులు తెలంగాణపై దాడి చేయబోతున్నాయా? మూడేళ్ళ తర్వాత మళ్ళీ స్వైన్ ఫ్లూ సంకేతాలు వైద్యారోగ్యశాఖకు కలవరం కలిగిస్తున్నాయి. గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ కేసుల పెరుగుదల నమోదైంది. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయింది. స్వైన్ ఫ్లూ (H1N1 Virus) కేసులు సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా బయటపడుతుంటాయి. ఆస్పత్రుల్లో ఈ కేసుల తీవ్రత క్రమేపీ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. .
నారాయణ గూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) కి వస్తున్న శాంపిల్స్ ని పరిశీలిస్తే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న సంగతిని డాక్టర్లే నిర్దారిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సి. శివలీల 2021, 2020లో ఎలాంటి నమూనాలు పంపలేదని, ఇప్పుడు నమూనాలు అందుతున్నాయని, నమూనాల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా శాంపిల్స్ ఐపీఎంకి చేరాయి. 15 రోజుల క్రితం గ్లోబల్ ఆస్పత్రికి కొన్ని శాంపిల్స్ వచ్చాయని డాక్టర్లు తెలిపారు. స్వైన్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపించాయి. తలనొప్పి, దగ్గు, జలుబు, కడుపులో నొప్పి, విరేచనాలు కనిపించాయి. కోవిడ్ కి సంబంధించి నెగిటివ్ నివేదికలు వచ్చాయి. అయితే వీరికి బ్యాక్టీరియల్ న్యూమోనియా నిర్దారణ అయింది. డాక్టర్లు వీరికి స్వైన్ ఫ్లూ లక్షణాలు వున్నాయని అనుమానిస్తున్నారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
అలజడి రేపిన కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు హెచ్1ఎన్1 వ్యాప్తిని కూడా నిరోధించినట్లుగా వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లూ వ్యాక్సిన్ హెచ్1ఎన్1కు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అయితే దీన్ని ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఐపీఎంకి రోజూ ఐదారు శాంపిల్స్ వస్తున్నాయని, అయితే రోగుల్ని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోవడం లేదన్నారు. పూర్తి నిర్దారణకు వచ్చాకే రోగులకు జాగ్రత్తలు చెబుతామన్నారు. పాఠశాలలు కూడా ప్రారంభం కావడంతో పిల్లలు జ్వరం, డయేరియా, కడుపునొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసుల తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ నుంచి వచ్చిన శాంపిల్స్ లో హెచ్ 1 ఎన్ 1 వైరస్ వుందని తేలింది. వైరల్ ఫీవర్స్ కూడా అక్కడ పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో టైఫాయిడ్ తో పాటు స్వైన్ ఫ్లూ విషయంలో అప్రమత్తంగా వుండాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Also: Yuzvendra Chahal: సమంత బాటలో చాహల్ భార్య.. అతడితో పార్టీకి హాజరుకావడమే కారణమా?
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!