Hyderabad: మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. మూడు స్టేషన్లు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ విజయ సంకల్ప సభ భారీ స్థాయిలో జరగనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభకు ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభలో ఆశీనులు అవుతారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుతో పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో అధికారులు కూడా ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు.
Read Also: LIVE: హైదరాబాద్లో హీటెక్కిన రాజకీయం.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
ఆదివారం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, జేబీఎస్ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు. ఈ మూడు స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగకుండా వెళ్తాయని, ప్రయాణికులు గమనించాలని సూచించారు. ప్రధాని మోదీ సభ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆయా మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు వివరించారు. మిగిలిన స్టేషన్లలో సర్వీసులు యథాతథంగా నడుస్తాయంటూ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కాగా ఆదివారం నాడు నగరంలోని మెట్రో రైళ్లు నిలిపివేస్తున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మవద్దని అభ్యర్థించారు.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?