తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చదువు చెప్పకుండా విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలామంది పేద విద్యార్థులు తరగతులకు హాజరు కాలేకపోయారని, ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు.
Read Also: గర్భం దాల్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్టు చూసి షాకైన డాక్టర్లు
కాగా ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. తాము వద్దని డిమాండ్ చేస్తున్నా పరీక్షలు నిర్వహించి ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని విమర్శలు చేశారు. కనీస మార్కులతో అయినా విద్యార్థులను పాస్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి విద్యార్థులు బలవుతున్నారని… ఇప్పటికే రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.