Srinivas Goud: బొత్సకు మంత్రి శ్రీనివాస్ సవాల్.. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud Challenges Botsa Satyanarayana Over Development: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. బొత్స కాపీ కొట్టి పరీక్షలు రాశారు కాబట్టే అలాంటి కామెంట్స్ చేశారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే.. అక్కడసుతో బొత్స ఆ మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. ఏపీ నాయకులందరూ తమ మూతి తాము కడుక్కుంటే మంచిదని సూచించారు. పోటీ పరీక్షల్లో ఏపీ రాజధాని ఏంటి? అని అడిగితే.. సమాధానం రాయలేని పరిస్థితి ఆ రాష్ట్రానిదని ఎద్దేవా చేశారు. తెలంగాణ విద్యార్థులు, ఏపీ విద్యార్థుల మధ్య పోటీ పరీక్షలు పడితే.. అసలు ట్యాలెంట్ బయటపడుతుందని వ్యాఖ్యానించారు. APPSCలో ఆనాడు స్కామ్స్ చేసిన చరిత్ర వాళ్ళదని, డబ్బుల కట్టలతో లాడ్జీలన్నీ నిండేవని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇంజినీరింగ్ కాలేజీలకు తాళాలు వేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదని చెప్పారు.
Suchitra Krishnamoorthi: ఈ రాత్రికి నాతో పడుకో.. తెల్లారి ఇంటిదగ్గర దింపుతా అన్నాడు
Also Read
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విడిపోవడానికి కారణం.. బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులేనని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తిరుమలలో కూడా వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తూ.. భక్తుల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు. బొత్స వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని సెటైర్ వేశారు. ఏపీలో కులాల పిచ్చి, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని తాము ఎప్పుడైనా అన్నామా? అని ప్రశ్నించారు. తాను ఎక్కడికి రమ్మన్నా వస్తానని.. నేను విజయవాడ కనకదుర్గమ్మలో గానీ, తిరుపతిలో గానీ అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు. గతంలో స్కాంలు జరిగాయని, అవే స్కామ్లు ఇప్పటికీ జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ అనుకుంటున్నారేమోనని కౌంటర్ వేశారు. తమ విద్యా వ్యవస్థను, విద్యార్థులను బొత్స అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు బొత్స హైదరాబాద్కు వచ్చినా సరేనని పేర్కొన్నారు.
AP v/s TS: మమల్ని రెచ్చగొట్టద్దూ.. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు సీరియస్..
కాగా.. ఆఫ్ర్టాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఏ రకంగా స్కామ్లు జరిగాయో చూశామని, అన్ని చూచిరాతలేనని అన్నారు. ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో కూడా వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని.. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదని పేర్కొన్నారు. ఈ విధంగా బొత్స చేసిన వ్యాఖ్యలకే శ్రీనివాస్ గౌడ్ పై విధంగా కౌంటర్ ఎటాక్ చేశారు.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!