Smita sabharwal: తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు.. స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్
Smita sabharwal: తెలంగాణ సీఎంఓ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆమె తరచూ ట్విట్టర్లో ఏదో ఒక అంశంపై పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల వీడియోను ఆమె రీట్వీట్ చేశారు. ఆ వీడియోలో, మహిళలు తీవ్ర ప్రమాదంలో తాళ్ల సహాయంతో బావిలోకి దిగడం కనిపించింది. ఆ మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి మంచినీటి కోసం బావిలోకి దిగింది. తమ గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. బావిలోకి దిగుతుండగా అందులో పడిపోతానేమోనని భయపడ్డానని, కానీ బతకడానికి నీరు అవసరమణి అందుకే ప్రాణాలు తెగించి నీటికోసం తాళ్ళు కట్టుకుని బావిలోకి దిగాల్సి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం స్వచ్ఛమైన మంచినీరు అందించాలని గ్రామస్తులు వేడుకున్నారు.
Same nation , different lives !
What a sad fate.
Telangana state has proved with @mb_telangana that a robust engineering design can alter nature’s anomaly and bring precious , pure drinking water 💧to the doorstep of all its 1 cr+ homes.
#TruimphantTelangana https://t.co/meDOI2NMFiAlso Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
— Smita Sabharwal (@SmitaSabharwal) May 27, 2023
అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని సంబంధించిన వీడియోను స్మితా సబర్వాల్ చలించిపోయారు. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన స్మిత..’ఒకే దేశం, విభిన్న జీవితాలు. విధి ఎంత విచారకరం’ అని రాసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని, మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేస్తుందన్నారు. పటిష్టమైన ఇంజనీరింగ్ ప్రకృతి విపత్తును మార్చగలదని చెప్పబడింది. తెలంగాణ ప్రభుత్వం దాదాపు కోటి ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని తీసుకొచ్చిందన్నారు. గతంలో తెలంగాణ ప్రజలు కూడా తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కొన్నారని ఆమె ట్వీట్ చేశారు. స్మితా సబర్వాల్ ట్వీట్పై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తెలంగాణలో ఏ గ్రామంలోనూ నీటి కొరత లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన వల్లే ఇది సాధ్యమైందన్నారు. మహారాష్ట్రలో కూడా కేసీఆర్కు అవకాశం ఇస్తే ఈ గ్రామాలకు ఇంటింటికీ నీళ్లు అందేలా చూస్తారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
Former died: ధ్యాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం.. నిద్రిస్తున్న రైతు పైనుంచి వెళ్లిన ట్రాక్టర్
తాజావార్తలు
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!