Smita sabharwal: తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు.. స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smita sabharwal: తెలంగాణ సీఎంఓ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆమె తరచూ ట్విట్టర్లో ఏదో ఒక అంశంపై పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల వీడియోను ఆమె రీట్వీట్ చేశారు. ఆ వీడియోలో, మహిళలు తీవ్ర ప్రమాదంలో తాళ్ల సహాయంతో బావిలోకి దిగడం కనిపించింది. ఆ మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి మంచినీటి కోసం బావిలోకి దిగింది. తమ గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. బావిలోకి దిగుతుండగా అందులో పడిపోతానేమోనని భయపడ్డానని, కానీ బతకడానికి నీరు అవసరమణి అందుకే ప్రాణాలు తెగించి నీటికోసం తాళ్ళు కట్టుకుని బావిలోకి దిగాల్సి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం స్వచ్ఛమైన మంచినీరు అందించాలని గ్రామస్తులు వేడుకున్నారు.
Same nation , different lives !
What a sad fate.
Telangana state has proved with @mb_telangana that a robust engineering design can alter nature’s anomaly and bring precious , pure drinking water 💧to the doorstep of all its 1 cr+ homes.
#TruimphantTelangana https://t.co/meDOI2NMFiAlso Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
— Smita Sabharwal (@SmitaSabharwal) May 27, 2023
అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని సంబంధించిన వీడియోను స్మితా సబర్వాల్ చలించిపోయారు. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన స్మిత..’ఒకే దేశం, విభిన్న జీవితాలు. విధి ఎంత విచారకరం’ అని రాసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని, మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేస్తుందన్నారు. పటిష్టమైన ఇంజనీరింగ్ ప్రకృతి విపత్తును మార్చగలదని చెప్పబడింది. తెలంగాణ ప్రభుత్వం దాదాపు కోటి ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని తీసుకొచ్చిందన్నారు. గతంలో తెలంగాణ ప్రజలు కూడా తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కొన్నారని ఆమె ట్వీట్ చేశారు. స్మితా సబర్వాల్ ట్వీట్పై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తెలంగాణలో ఏ గ్రామంలోనూ నీటి కొరత లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన వల్లే ఇది సాధ్యమైందన్నారు. మహారాష్ట్రలో కూడా కేసీఆర్కు అవకాశం ఇస్తే ఈ గ్రామాలకు ఇంటింటికీ నీళ్లు అందేలా చూస్తారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
Former died: ధ్యాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం.. నిద్రిస్తున్న రైతు పైనుంచి వెళ్లిన ట్రాక్టర్
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..