Singur Dam: నిండుకుండలా సింగూరు..జలకళ
భారీవర్షాలు వారం నుంచి తెలంగాణ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నిండు కుండలామారి జలకళను సంతరించుకుంది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక,మహారాష్ట్రాల నుండి భారీగా వరద నీరు సింగూర్ ప్రాజెక్టులోకి వచ్చిచేరుతుంది.దీనికి తోడు సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.గత వారం రోజులుగా రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 3 టీఎంసీలకు పైగా వరద నీరు వచ్చి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగూర్ ప్రాజెక్టు లోకి వరద నీటి ప్రవాహం రోజు రోజుకు భారీగా వచ్చి చేరుతోంది.
Donations: రాజకీయ పార్టీలనూ తాకిన కొవిడ్ దెబ్బ.. 41.49శాతం తగ్గిన విరాళాలు
Also Read
- Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
- TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15 వేల 955 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు లో 22.417 టీఎంసీల నీటి నిల్వగా నమోదైంది.సింగూర్ ప్రాజెక్టులోకి మరో నాలుగు,ఐదు టీఎంసీల వరద నీరు వచ్చిచేరితే ప్రాజెక్టు గేట్స్ ఎత్తి దిగువన ఉన్న ఘనపూర్,నిజాంసాగర్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామన్నారు ఇరిగేషన్ అధికారులు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీటి ఇన్ ఫ్లో కొనసాగుతుందన్నారు అధికారులు.
వర్షాలు ఇలాగే కురిస్తే వరద నీరు ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మునిపల్లి, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్ కల్, మనూరు, నాగల్ గిద్ద, రేగోడు, వట్ పల్లి మండలాలతో పాటు పుల్కల్ లో భారీ వర్షం నమోదు కావడంతో ఆ వరద నీరంతా ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో కలుస్తుంది. వరద నీటి ప్రవాహం రాకముందు ప్రాజెక్టులో 18 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, తాజాగా కురిసిన వర్షాలకు దాదాపుగా మూడు టీఎంసీలకు పైగా కొత్త నీరు వచ్చి చేరింది. వానాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టులో సగం టీఎంసీల నీరు ఉండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కొత్తగా వచ్చి చేరిన వరద నీటితో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిసరాలు నీటి అలలతో కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ప్రాజెక్టు దిగువ ఉన్న వ్యవసాయ సాగుకు,అలాగే తాగునీటి అవసరాలకు ఎలాంటి నీటి ఢోకా లేదన్నారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంజీరా నదిలోకి నీరుచేరుతుందన్నారు.దింతో మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు,రైతులు,పశువుల కాపారులు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు.
Lal Singh Chadda: చిరు, నాగ్, రాజమౌళి, సుకుమార్ కు ‘లాల్ సింగ్ చద్దా’ ప్రివ్యూ
తాజావార్తలు
-
Hardik Pandya: హార్దిక్ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
-
Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
-
AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?