Singur Dam: నిండుకుండలా సింగూరు..జలకళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలు వారం నుంచి తెలంగాణ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నిండు కుండలామారి జలకళను సంతరించుకుంది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక,మహారాష్ట్రాల నుండి భారీగా వరద నీరు సింగూర్ ప్రాజెక్టులోకి వచ్చిచేరుతుంది.దీనికి తోడు సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.గత వారం రోజులుగా రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 3 టీఎంసీలకు పైగా వరద నీరు వచ్చి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగూర్ ప్రాజెక్టు లోకి వరద నీటి ప్రవాహం రోజు రోజుకు భారీగా వచ్చి చేరుతోంది.
Donations: రాజకీయ పార్టీలనూ తాకిన కొవిడ్ దెబ్బ.. 41.49శాతం తగ్గిన విరాళాలు
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15 వేల 955 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు లో 22.417 టీఎంసీల నీటి నిల్వగా నమోదైంది.సింగూర్ ప్రాజెక్టులోకి మరో నాలుగు,ఐదు టీఎంసీల వరద నీరు వచ్చిచేరితే ప్రాజెక్టు గేట్స్ ఎత్తి దిగువన ఉన్న ఘనపూర్,నిజాంసాగర్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామన్నారు ఇరిగేషన్ అధికారులు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీటి ఇన్ ఫ్లో కొనసాగుతుందన్నారు అధికారులు.
వర్షాలు ఇలాగే కురిస్తే వరద నీరు ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మునిపల్లి, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్ కల్, మనూరు, నాగల్ గిద్ద, రేగోడు, వట్ పల్లి మండలాలతో పాటు పుల్కల్ లో భారీ వర్షం నమోదు కావడంతో ఆ వరద నీరంతా ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో కలుస్తుంది. వరద నీటి ప్రవాహం రాకముందు ప్రాజెక్టులో 18 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, తాజాగా కురిసిన వర్షాలకు దాదాపుగా మూడు టీఎంసీలకు పైగా కొత్త నీరు వచ్చి చేరింది. వానాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టులో సగం టీఎంసీల నీరు ఉండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కొత్తగా వచ్చి చేరిన వరద నీటితో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిసరాలు నీటి అలలతో కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ప్రాజెక్టు దిగువ ఉన్న వ్యవసాయ సాగుకు,అలాగే తాగునీటి అవసరాలకు ఎలాంటి నీటి ఢోకా లేదన్నారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంజీరా నదిలోకి నీరుచేరుతుందన్నారు.దింతో మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు,రైతులు,పశువుల కాపారులు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు.
Lal Singh Chadda: చిరు, నాగ్, రాజమౌళి, సుకుమార్ కు ‘లాల్ సింగ్ చద్దా’ ప్రివ్యూ
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!