Donations: రాజకీయ పార్టీలనూ తాకిన కొవిడ్ దెబ్బ.. 41.49శాతం తగ్గిన విరాళాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను వణికించిన కొవిడ్ మహమ్మారి ప్రభావం రాజకీయ పార్టీలను కూడా తాకింది. కొవిడ్ కారణంగా పార్టీలకు వచ్చే విరాళాలకు భారీగా కోతపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పార్టీలకు అందిన వివరాలతో విడుదలైన ఏడీఆర్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు అందిన విరాళాలు ₹420 కోట్లకు పైగా తగ్గాయని, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 41.49 శాతం తగ్గాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్ మొదటి వేవ్ 2020 మార్చి చివరి వారంలో అంటే ఆర్థిక ఏడాది ప్రారంభం ముందే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించేందుకు కారణమైంది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. భారతీయ జనతా పార్టీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్ల విరాళాలు రాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.477.54కోట్లకు తగ్గింది. అంటే 39.23శాతం మేర విరాళాలు తగ్గాయి. ఇక, కాంగ్రెస్ పార్టీకి 2019-20లో రూ.139.01కోట్ల విరాళాలు రాగా.. కరోనా సమయంలో కేవలం రూ.74.52కోట్లు మాత్రమే సమకూరాయి.
Also Read
- Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
Loksabha Speaker: ఏ పదాన్ని నిషేధించలేదు.. తప్పుడు ప్రచారాలు చేయొద్దు..
అత్యధికంగా దిల్లీ నుంచి రూ. 246కోట్లు జాతీయ పార్టీలకు విరాళంగా అందాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రూ.71.68కోట్లు, గుజరాత్ నుంచి రూ.47 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఎనిమిది జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇక ఎనిమిది గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో 80శాతానికి పైగా అంటే.. రూ.480.655కోట్లు కార్పొరేట్, బిజినెస్ రంగాల నుంచి వచ్చినవే. మరో రూ.111.65 కోట్లను 2,258 మంది వ్యక్తులు విరాళంగా ఇచ్చినట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. అధికార బీజేపీకి కార్పొరేట్, వ్యాపార రంగం నుంచి సుమారు 11 వందల విరాళాలు అందగా.. వీటి విలువ రూ. 416.79 కోట్లుగా ఉంది. విపక్ష కాంగ్రెస్కు ఆయా వర్గాల నుంచి 146 విరాళాలు అందగా.. వాటి విలువ 38.63 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
.
- Tags
- ADR report
- bjp
- BSP
- congress
- corona virus
తాజావార్తలు
-
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్లో లైవ్ కన్సర్ట్ షురూ!
-
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!